11న వస్తోన్న సైకలాజికల్ థ్రిల్లర్ 'ది ఐస్'

  • IndiaGlitz, [Saturday,September 05 2015]

రామ్ గోపాల్ వర్మ 365 డేస్' చిత్రాన్ని నిర్మించిన యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ డి.వి.వెంకటేష్ నిర్మాతగా డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై మీరాజాస్మిన్ ప్రధానపాత్రలో నటించిన మలయాళ చిత్రాన్నిది ఐస్' అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అదే పేరుతో అందిస్తున్నారు. ఈ చిత్రానికి షాజియం దర్శకుడు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదలవుతుంది.

ఈ సందర్భంగా....

చిత్ర నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ 'పందెంకోడి, గుడుంబా శంకర్, అమ్మాయి బాగుంది వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ పెళ్లికి ముందు నటించిన మలయాళ చిత్రమిది. అంధురాలిగా ఉన్న యువతికి కంటిచూపు వస్తుంది. కానీ ఆమెకి అప్పటి నుండి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. అవేంటో సినిమాలో చూడాల్సిందే. సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా మంచి కలెక్షన్స్ ను సాధించింది. నేను మలయాళంలో ఈ చిత్రాన్ని చూడగానే నాకు బాగా నచ్చింది.

తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందనిపించింది, అందుకే ఈ చిత్ర రైట్స్ ను కొని తెలుగులో ది ఐస్ పేరుతో విడుదల చేస్తున్నాను. అంతే కాకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క సహాయంతో రీరికార్డింగ్ ను కొత్తగా చేయించాను. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేస్తున్నాం. షాజియం ఒక మంచి పాయింట్ తో ఇంతకు ముందు చెప్పిన విధంగా హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సినిమాని తెరకెక్కించారు. మీరా జాస్మిన్ నటన హైలైట్ గా నిలుస్తుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. అలాగే మా బ్యానర్ లో వంశీగారి దర్శకత్వంలో రూపొందిన వెన్నల్లో హాయ్ హాయ్'చిత్రాన్ని కూడా త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

More News

మంచు విష్ణు నూతన చిత్రం విశేషాలు...

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ మంచు విష్ణు హీరోగా, ‘జాదూగాడు’ ఫేమ్ సోనారిక హీరోయిన్ గా ఓ నూతన చిత్రం రూపొందనుంది.

ఎన్.టి.ఆర్ తో ప్లాన్ చేస్తున్నారట...

వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న యువ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి ‘కుమారి 21 ఎఫ్’ పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇల్లీ బేబి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు...

జగన సుందరిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగులో సినిమాలు చేయడం లేదు.

కంచె గురించి మహేష్ స్పందించడానికి కారణం అదేనా...?

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం కంచె. ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు.

'బ్రూస్ లీ' కామెడి ?

మార్షల్ ఆర్ట్స్ లో నెంబర్ వన్ అయిన బ్రూస్ లీ కామెడి చేయడమేంటని అనుకుంటున్నారా. ఆయన గురించి కాదులేండి.