Gokul Chat:'గోకుల్‌ చాట్' అధినేత కన్నుమూత.. కోఠిలో విషాదఛాయలు.

  • IndiaGlitz, [Friday,December 22 2023]

హైదరాబాద్‌లోని 'గోకుల్‌ చాట్' గురించి తెలియని వారుండరూ అంటే అతిశయోక్తి కాదు. దేశంలోని ప్రఖ్యాతిగాంచింది. గోకుల్‌ చాట్‌ వ్యవస్థాపకుడు ముకుంద్‌దాస్‌ విజయ్‌వర్గీయ(75) కన్నుమూశారు. వయో సంబంధ సమస్యల కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాచిగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స గురువారం ఉదయం పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కోఠి, సుల్తాన్‌బజార్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

పలువురు రాజకీయ ప్రముఖలు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఇమ్లిబన్‌ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. 1966లో కోఠిలో ‘గోకుల్‌ చాట్‌’ పేరిట చాట్‌ భండార్‌ ఏర్పాటుచేశారు. రుచి, శుచితో చాట్‌ ప్రియుల ఆదరణ పొంది అంచెంచెలుగా ఎదిగి దేశవ్యాప్తంగా పేరు దక్కించుకుంది.

కాగా 2007 ఆగస్టు 25వ తేదీన కోఠిలోని గోకుల్ చాట్‌తో పాటు లుంబినీ పార్క్‌లోనూ ఉగ్రవాదులు బాంబు దాడులు జరిపారు. ఈ నరమేధంలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. గోకుల్ చాట్ దుకాణం వద్ద జరిగిన పేలుడులో 33 మంది మరణించగా.. లుంబినీ పార్కులో జరిగిన పేలుడులో 9 మంది మరణించారు. వంలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులకు పాల్పడిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు ఇటీవల శిక్ష పడింది. హైదరాబాద్‌కు చెందిన ఒబేదుర్ రహ్మన్‌తో పాటు, ధనీష్ అన్సారీ, అఫ్తాబ్ అలాం, ఇమ్రాన్ ఖాన్‌లకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎన్‌ఐఏ(NIA) కోర్టు తీర్పు వెల్లడించింది.

More News

Raghava Reddy:మాస్ అండ్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ‘రాఘవ రెడ్డి’... ఆకట్టుకుంటోన్న ట్రైలర్

శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో

AP Govt:ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. విశాఖ నుంచి పరిపాలన లేనట్లే..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కుదురైంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలకు న్యాయస్థానం బ్రేక్ వేసింది.

YS Jagan Birthday: వరల్డ్ టాప్ ట్రెండింగ్‌లో సీఎం జగన్ బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ పుట్టినరోజును పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. వారం రోజుల ముందే అభిమానులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో పాటు సంబరాలు చేయడం మొదలుపెట్టారు.

Akbaruddin vs Revanth: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ మధ్య పవర్ వార్

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్‌ రంగంపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ..

CM Jagan:మంచి చేస్తుంటే చంద్రబాబు, దత్తపుత్రుడు ఏడుస్తున్నారు: సీఎం జగన్

ప్రజలకు మంచి చేస్తున్న తనపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌(Pawankalyan) దిగజారి మాట్లాడుతున్నారని సీఎం జగన్(CM