కరోనాతో పోరాడి ఇంటికి చేరిన అనంతరం పక్షవాతానికి గురైన నటి..

  • IndiaGlitz, [Wednesday,December 16 2020]

కరోనా కారణంగా ఎవరేంటనే విషయం తెలిసొచ్చింది. అసలైన హీరో, హీరోయిన్లు ఎవరనే విషయం తెలిసింది. సెలబ్రిటీల్లో పెద్ద హీరోలంతా ఇళ్లకే పరిమితమై వంట, గార్డెనింగ్ అంటూ సమయం గడిపిస్తే.. కొందరు నటీనటులు మాత్రం బయటకు వచ్చి తాము చేయగలిగిన సాయాన్ని చేసి ప్రజలకు చాలా చేరువయ్యారు. సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూ సూద్.. కరోనా టైమ్‌లో ప్రజలకు ఎంతో సాయం చేసి రియల్ లైఫ్ హీరోగా మారిపోయారు.

ఇక బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా కరోనా సమయంలో ప్రజానీకాన్ని ఆదుకునేందుకు నర్స్ అవతారమెత్తింది. నిజానికి ఆమె నర్సింగ్ పూర్తి చేసింది. కానీ సినిమాలపై మక్కువతో నర్సింగ్‌ను పక్కనబెట్టేసింది. సెలబ్రిటీ అయిన తర్వాత తిరిగి నర్స్ అవ్వాలని ఎవరూ ఫీల్ అవరు. కానీ ఆమె మాత్రం కరోనా సమయంలో ప్రజలకు సేవలందించేందుకు తిరిగి నర్స్‌గా మారిపోయింది. నర్స్‌గా ఎంతో మందికి సేవలందించింది.

ఈ క్రమంలోనే శిఖా మల్హోత్ర కరోనా బారిన పడింది. దీంతో కోవిడ్‌తో పోరాటం చేసి శిఖా ఇటీవలే ఇంటికి చేరుకుంది. అనంతరం ఆమె పక్షవాతానికి గురై తిరిగి ఆసుపత్రిలో చేరింది. ఈ విషయాన్ని శిఖా మేనేజర్ అశ్విన్ శుక్లా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆమెకు సంబంధించిన ఒక ఫోటోను సైతం ఆయన షేర్ చేశారు. దీంతో శిఖా కోలుకోవాలని.. క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

More News

ఇకపై దుర్గమ్మను దర్శించుకోవాలంటే డబుల్ చెల్లించుకోవాల్సిందే..

బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి రేట్లు భారీగా పెంచేశారు. ఈ నిర్ణయాన్ని దుర్గగుడి అధికారులు తీసుకోగా..

వాయిదా పడిన సింగర్ సునీత వివాహం..

ప్రముఖ సింగర్ సునీత మరోసారి వివాహానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సునీత..

చేపల వేటకు వెళ్లిన వారికి షాక్... బీచ్‌లో కొట్టుకొచ్చిన బంగారం

చేపల వేటే వారికి జీవనాధారం.. వాటిని పట్టుకుని అమ్మితేనే రోజు గడుస్తుంది. ఎప్పటిలాగే మత్స్యకారులంతా ఆ రోజు కూడా చేపల వేటకు వెళ్లారు.

భర్తతో కలిసి ‘ఆచార్య’ సెట్స్‌కి కాజల్.. బొకేతో మెగాస్టార్ స్వాగతం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి.

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు 3 ముద్దుగుమ్మలు.. లక్షల్లో రెమ్యునరేషన్..

పెద్దగా అంచనాలేమీ లేకుండా స్టార్ట్ అయినప్పటికీ.. ఇప్పుడు మంచి రేటింగ్స్‌తో బిగ్‌బాస్ రియాలిటీ షో దూసుకుపోతోంది.