రీమేక్ సినిమాకు త‌రుణ్ భాస్క‌ర్ మాట‌లు?

తొలి చిత్రం పెళ్ళిచూపులుతో హిట్ కొట్టి ద‌ర్శ‌కుడిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్‌. ఈ యంగ్ డైరెక్ట‌ర్‌కు ఈ సినిమాకు రైటింగ్ విభాగంలో నేష‌న‌ల్ అవార్డు కూడా రావ‌డం విశేషం. రీసెంట్‌గా మీకు మాత్ర‌మే చెప్తా సినిమాతో హీరోగానూ మారాడు. అడ‌పా ద‌డ‌పా కొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లోనూ న‌టించాడు త‌రుణ్ భాస్క‌ర్‌. కాగా.. డైరెక్ట‌ర్‌గా వెంక‌టేశ్‌తో సినిమా చేయ‌డానికి త‌రుణ్ సిద్ధంగా ఉన్నారు. అయితే క‌రోనా టైమ్‌, మ‌రోవైపు వెంక‌టేశ్ నార‌ప్ప సినిమాను ఇంకా పూర్తి చేయ‌లేదు. దీంతో త‌రుణ్ భాస్క‌ర్ సినిమా మొద‌లు కావ‌డానికే స‌మ‌యం ప‌ట్టేలా ఉంది.

అయితే ఈలోపు త‌రుణ్ భాస్క‌ర్‌కు మంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. అదేంటంటే త‌మిళ చిత్రం ఓ మై క‌డవులేను తెలుగులో రీమేక్ చేయ‌డానికి నిర్మాత పీవీపీ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నారు. ఈ రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఓ మై క‌డ‌వులే తెలుగు వెర్ష‌న్‌కు మాట‌ల‌ను రాయ‌మ‌ని పీవీపీ... త‌రుణ్ భాస్క‌ర్‌ను కోరాడ‌ట‌. ఫ్యాన్సీ మొత్తాన్ని ఆఫ‌ర్ చేయ‌డంతో త‌రుణ్ భాస్క‌ర్ మాట‌లు రాయ‌డానికి రెడీ అయ్యాడ‌ని టాక్. ఈ రీమేక్‌ను విశ్వ‌క్‌సేన్‌తో తెర‌కెక్కిస్తార‌ని వార్త‌లు వ‌చ్చినా.. అదేంలేద‌ని విశ్వ‌క్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. మ‌రి ఈ రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

More News

పసిపాప ప్రాణం కోసం ఫ్లైట్‌లో తల్లిపాలు.. అసలు కథేంటంటే..

కనీసం నెల రోజులు కూడా నిండని పసికందు ప్రాణాన్ని నిలుపుకోవడం కోసం పాప తల్లిదండ్రులే కాదు..

తిరుమల ఆలయ పెద్ద జీయ్యంగార్‌కు కరోనా.. కీలక నిర్ణయం దిశగా టీటీడీ!

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ కరోనా విజృంభిస్తోంది. ఒక్క టీటీడీలోనే కరోనా కేసులు 150కి పైగా నమోదయ్యాయి.

మ‌హేశ్ డబుల్ ధ‌మాకా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం స‌ర్కారువారి పాట‌. ఈ ఏడాది సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రుతో మ‌హేశ్ సూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే.

37 ఏళ్ల త‌ర్వాత ఆ బ్యాన‌ర్‌లో మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించాల‌ని నిర్మాతలు భావిస్తుంటారు. ఆయ‌న చేసిన 150 చిత్రాల్లో చాలా మందినిర్మాత‌ల‌తో

సుశాంత్ ఆత్మతో మాట్లాడాడట.. వీడియో వైరల్

సుశాంత్ రాజ్‌పుత్ అకాల మరణం పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే.