Thalapathy Vijay:రాజకీయాల్లోకి దళపతి విజయ్.. కొత్త పార్టీ ప్రకటన..

  • IndiaGlitz, [Friday,February 02 2024]

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. తాను రాజకీయాల్లోకి వస్తు్న్నట్లు ఆయన అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే 'తమిళగ వెట్రి కజగం' పేరుతో కొత్త పార్టీని కూడా ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. తమిళ ప్రజలు కోరుకునే మౌలికమైన రాజకీయ మార్పునకు నాయకత్వం వహిస్తానని స్పష్టంచేశారు. విజయ్ కొత్త పార్టీ ప్రకటన తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది.

కాగా కొద్ది రోజుల నుంచి విజయ్.. కొత్త పార్టీ పెట్టనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల డిసెంబర్‌లో భారీ వరదలు వచ్చినప్పుడు బాధిత కుటుంబాలను విజయ్ స్వయంగా వెళ్లి కలిశారు. అంతేకాకుండా వారికి ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. అలాగే మెరిట్ స్టూడెంట్స్‌కి స్కాలర్‌షిప్ ఇవ్వడం వంటి చేశారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమని అభిమానులు భావించారు. ఇప్పుడు వారి అంచనాలను నిజం చేస్తూ పార్టీ ప్రకటించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కచ్చితంగా తమ హీరోను సీఎం చేసి తీరుతామని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాలతో తొలి నుంచి సినీ ఇండస్ట్రీకి సంబంధం ఉంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజ నేతలు చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం ఏకంగా ముఖ్యమంత్రులు అయి ఏళ్ల పాటు పాలించారు. అయితే వారి మరణం తర్వాత ఇప్పటివరకు ఏ సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి కాలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఓ దశలో ఆయన కూడా సొంతంగా పార్టీ పెట్టాలని భావించారు. అయితే ఏమైందో ఏమో తాను రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఇక లోకనాయకుడు కమల్ హాసన్ పార్టీ పెట్టినా అక్కడి రాజకీయాల్లో తనదైన ముద్ర వేయలేకపోయారు. 2021లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. అప్పటి నుంచి ఏ స్టార్ హీరో మళ్లీ తమిళ రాజకీయాల్లో బలమైన ముద్ర వేస్తారనే చర్చ మొదలైంది. ఇందుకు సమాధానంగా దళపతి విజయ్ పేరు తెరపైకి వచ్చింది. అందరూ అనుకున్నట్లే రజినీకాంత్ తర్వాత తమిళనాట అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్.. ఇన్నేళ్లకు రాజకీయ అరంగేట్రం చేశారు.

ఇప్పటికే ఆయన అభిమానులు 'విజయ్ మక్కల్ ఇయక్కమ్' పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 2022లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 'మక్కల్ ఇయక్కమ్' తరపున అభ్యర్థులు 169 స్థానాల్లో పోటీ చేస్తే 121 స్థానాల్లో విజయం సాధించారు. కమల్ హసన్ పార్టీ 'మక్కల్ నీదిమయ్యం', సీమాన్ నేతృత్వంలోని 'నామ్ తమిలర్ కట్చి' కనీసం ఈ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. దీంతో పూర్తిగా రాజకీయాల్లోకి రాకముందే ఇంత భారీ స్థాయిలో సీట్లు సాధించడంతో విజయ్ పేరు మార్మోగింది. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో తమిళ రాజకీయాల్లో ఎలాంటి చరిత్ర సృష్టిస్తారో వేచి చూడాలి.

More News

Bandla Ganesh:మల్కాజ్‌గిరి పార్లమెంట్ టికెట్ కోసం బండ్ల గణేష్ దరఖాస్తు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది.

Poonam Pandey:బాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ పాండే కన్నుమూత..!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. మోడల్‌గా, హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న పూనమ్ పాండే క్యాన్సర్‌తో మరణించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ సంచలనంగా మారింది.

Sharmila:ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా.. జాతీయ పార్టీల నేతలతో భేటీ..

ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ ఆ అంశం గురించి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కనీసం స్పందించడమే మానేశారు.

Chiranjeevi:'విశ్వంభర' షూటింగ్‌లో జాయిన్ అయిన చిరంజీవి.. మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్..

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం 'బింబిసార' దర్శకుడు వశిష్ట దర్శత్వంలో

2047 నాటికి భారత్‌ అభివృద్ధే లక్ష్యం.. బడ్జెట్ విశేషాలు ఇవే..

2024-25 సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ఆమె ప్రకటించారు.