‘తలైవి’ ట్రైలర్ : బొమ్మ బ్లాక్ బస్టరే..!

  • IndiaGlitz, [Tuesday,March 23 2021]

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలిత బయోపిక్‌‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘తలైవి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కంగనా నటిస్తోంది. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు ఏఎల్ విజయ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు.

హితేష్ ఠక్కర్, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో తొలుత ఆమె సినీ జీవితాన్ని చూపించారు. అనంతరం ఎంజీఆర్‌తో పరిచయం... రాజకీయంగా తలైవిని ఆయన పైకి తీసుకురావడం.. ఎంజీఆర్ మరణం.. అనంతరం ఆమె ఎదుర్కొన్న అవమానాలు.. ఫైనల్‌గా అధికారాన్ని చేజిక్కించుకోవడం వంటి అంశాలతో ఈ టైటిల్‌ను కట్ చేశారు. నిజానికి ఆమె పేరు మాత్రమే మనకు తెలుసని.. ఆమె జీవితం పూర్తిగా తెలియదని ఆ తెలియని కోణాన్ని పరిచయం చేస్తున్నట్టు ట్రైలర్ ఆరంభంలోనే విజయ్ మనకు చెప్పారు.

ట్రైలర్‌ను బట్టి చూస్తే.. జయలలిత పాత్రలో కంగనా జీవించేశారు. నటికి.. రాజకీయ నేతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్లియర్‌గా చూపించారు. భావోద్వేగాలన్నీ కంగనా అద్భుతంగా పండించారు. ఇక ఎంజీఆర్ పాత్రకు అరవింద్ స్వామి నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఆ పాత్రకు ఆయనే హైలైట్. ఇక నార్త్ ఇండియన్‌.. తలైవి ఇంగ్లీష్ మాట్లాడిన తీరుకు ఆశ్చర్యపోయి.. ‘సౌత్ ఇండియన్ ఇంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతారని అనుకోలేదు’ అంటే.. ‘ఒక నార్త్ ఇండియన్ ఇంగ్లీష్‌ను ఇంత బాగా అర్థం చేసుకోగలరని భావించలేదు’ అంటూ సెటైర్ వేసిన తీరు అద్భుతం. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనడంలో సందేహం లేదనిపిస్తోంది.

More News

సూర్యాపేట కబడ్డీ పోటీల్లో అపశృతి.. 100 మందికి గాయాలు

సూర్యాపేటలో 47వ జాతీయ స్థాయి కబడ్డీ ప్రారంభోత్సవంలో  అపశ్రుతి చోటుచేసుకుంది.

భార్య పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆయనిచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్  మీడియాలో సంచలనంగా మారింది.

జాతీయ అవార్డులను గెలుచుకున్న ‘జెర్సీ’, ‘మహర్షి’

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర వివరాలను వెల్లడించింది.

ఉగాదికి ప్రారంభం కానున్న ఆది సాయి కుమార్, భాస్కర్ బంటు పల్లి ల సినిమా..!!!

వరుస హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో ఆది సాయి కుమార్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

'ఇక్షు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన అల్లరి నరేష్

పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు , డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో  రాం అగ్నివేష్ కథానాయకుడిగా ఋషిక దర్శకత్వంలో