జయలలితగా అదరగొట్టిన కంగనా

  • IndiaGlitz, [Saturday,November 23 2019]

సినిమాలు, రాజకీయాలు రెండింటిలో గొప్పస్థాయికి ఎదిగింది. సినిమాలు తనను సూపర్ స్టార్ గా నిలబెడితే... రాజకీయాలు తనను సీఎం ను చేశాయ్. అంతకు మించి తమిళుల అమ్మ తలైవిగా అనుబంధాన్ని పెంచాయ్. ఆమె ఎవరో కాదు జయలలిత. అలాంటి మహానాయకురాలు, మహానటి జీవిత చరిత్ర పై ఇప్పటికే చాలా చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయ్. అందులో ఒకటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం తలైవి.  విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి అప్ డేట్స్ ఇచ్చింది యూనిట్. జూన్ 26 2020లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేసి... జయలలిత అభిమానులు, ప్రేక్షకులకు డబుల్ హ్యాపినెస్ ఇచ్చింది.

బాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్లలో ఒకరైన కంగనా... ఈ పాత్రలో చక్కగా ఒదిగి పోయారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. టీజర్ లో అటు హీరోయిన్ గా  మెప్పించిన కంగనా... ఇటు రాజకీయ నాయకురాలిగాను జయలలిత లుక్ లో అదరగొట్టేశారని చెబుతున్నారు. మొత్తానికి  తలైవి టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. కాగా సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తుండగా... ఎన్టీఆర్ పాత్ర కోసం తారక్ ను సంప్రదించింది చిత్ర యూనిట్. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట నిర్మాతలు. కానీ తాత పాత్రకు తాను న్యాయం చేయలేనని ఎప్పుడూ చెబుతూనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్... ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట.

More News

చైత‌న్య త‌దుప‌రి ఖ‌రారు.. రూ100 కోట్ల డైరెక్ట‌ర్‌కు ఎట్ట‌కేల‌కు ఛాన్స్‌

అక్కినేని నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు శ‌నివారం. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు అంద‌రూ అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

శివసేనకు ఎన్సిపి షాక్ ... మహారాష్ట్ర సీఎం గా ఫడ్నవీస్ ప్రమాణం

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. నిన్నటి వరకు శివసేన , ఎన్సిపి, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంతా భావించిన...

బీజేపీకి మద్ధతిచ్చేది లేదు... అజిత్ పవార్ హద్దు మీరారు : శరద్ పవార్

మహా రాజకీయ పరిణామాలపై స్సందించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ముంబైలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన....

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం రిలీజ్ ఖ‌రారు

రాంగోపాల్ వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ట్రైలర్, సాంగ్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.

అర్జున్ సురవరం ప్రి రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగా స్టార్

అర్జున్ సురవరం ... క్రైమ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 29న రిలీజ్ కానుంది. నిఖిల్ సిద్ధార్థ్,