బెజవాడలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్య.. సత్రంలో తల్లీకొడుకు, కృష్ణానదిలో దూకి తండ్రీకొడుకు

  • IndiaGlitz, [Saturday,January 08 2022]

ఇటీవల కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్ చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడిగా వున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవను పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మరవకముందే విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం.

నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్, శ్రీలత దంపతులు తమ కుమారులు అఖిల్ (28), ఆశిష్ (22)తో కలిసి విజయవాడ కనక దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. స్థానిక కన్యకా పరమేశ్వరి సత్రంలో వీరు బస చేశారు. ఏం జరిగిందో తెలియదు గానీ వీరి కుటుంబం సూసైడ్ చేసుకుంది.
శ్రీలత, చిన్న కుమారుడు ఆశిష్ సత్రంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. రూమ్.నెం.312 లో వీరిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో కృష్ణా నదిలో దూకిన పప్పుల రమేష్,పెద్ద కుమారుడు అఖిల్ గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమించి రమేష్ (56) మృతదేహాన్ని వెలికితీశారు. అఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇతడు నిజామాబాద్‌లో ఓ పెట్రోల్ బంకును లీజుకు తీసుకుని నడుపుతున్నట్లుగా తెలుస్తోంది.

అఖిల్ పేరిట సత్రంలో గది బుక్ చేసుకున్న ఈ కుటుంబం.. అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో బంధువులకు మెసేజ్‌ పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధతోనే చనిపోతున్నట్లు వీరు బంధువులకు పెట్టిన మెసేజ్‌లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న బెజవాడ పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

More News

గుర్తుపట్టలేనంతంగా మారిపోయా.. మైండ్ బ్లాంక్ అయ్యింది: కోవిడ్ అనుభవాలు పంచుకున్న దీపికా

దేశంలో మొదటి, రెండో దశ కోవిడ్ వ్యాప్తి సమయంలో లక్షలాది మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో పలువురు సెలబ్రెటీలు సైతం వున్నారు.

తమిళ చిత్ర సీమలో కోవిడ్ కలకలం.. కట్టప్పకు పాజిటివ్, పరిస్ధితి విషమం..?

సినీ పరిశ్రమలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే కమల్ హాసన్, విక్రం, వడివేలు, మహేశ్‌బాబు , మంచు లక్ష్మి, త్రిష, మీనా

కరోనాతో ఐసీయూలో .. రెండు రోజుల్లో నా శవానికి మంట పెట్టేస్తారనుకున్నా: రాజశేఖర్ కంటతడి

2019 చివరిలో చైనాలో పుట్టిన కోవిడ్ మహమ్మారి మనిషిని నాలుగు గోడల మధ్య బందీని సంగతి తెలిసిందే.

సస్పెన్స్‌కు తెర.. ఉద్యోగులకు 23 శాతం పీఆర్‌సీ ప్రకటించిన జగన్

గత కొన్ని నెలలుగా ఉద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించింది.

భార్యకు కరోనా, ఫ్యామిలీకి దూరంగా క్వారంటైన్‌లో... అయినా బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌

దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు.