Sonia Gandhi Birthday: గాంధీభవన్‌లో ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

  • IndiaGlitz, [Saturday,December 09 2023]

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు హైదరాబాలోని గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, వీహెచ్, ఇతర సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సోనియా గాంధీ పుట్టినరోజు కేక్ కట్ చేసే హక్కు, అర్హత వీహెచ్‌కే ఉందంటూ ఆయనతో రేవంత్ రెడ్డి కేక్ కట్ చేయించారు. అనంతరం రేవంత్‌కు వీహెచ్ కేక్ తినిపించి ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం విశేషం.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినం రోజునే తెలంగాణ ప్రకటన వచ్చిందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. కార్యకర్తల త్యాగం, కష్టంతోనే అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ మొదలు పెట్టిందని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొన్నా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఇచ్చిన నిజమైన తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని కొనియాడాదరు.

2017 డిసెంబర్ 9న మొదటిసారి గాంధీభవన్‌లో కాలు పెట్టానని.. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు డిసెంబర్ 9న ముఖ్యమంత్రిగా అడుగుపెట్టానని సంతోషం వ్యక్తం చేశారు. కార్యకర్తల కృషితోనే ఈరోజు అధికార పార్టీ హోదాలో మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీల్లో రెండింటిని సోనియా పుట్టిన రోజున ప్రారంభించడం సంతోషకరమని వెల్లడించారు.

More News

Telangana Ministries: తెలంగాణ మంత్రులకు శాఖల వివరాలు ఇవే..

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం..

Akbaruddin Owaisi: తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ

తెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభాకానున్నాయి. నాలుగురోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికలైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది.

Bigg Boss Telugu 7: శోభాపై శివన్న చిందులు, అమర్‌పైనా ఫైర్

బిగ్‌బాస్ 7 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఓటు అప్పీల్ టాస్క్‌లు నడుస్తున్నాయి. అయితే అమర్‌దీప్ వ్యవహారశైలి ఎందుకో గాడి తప్పింది.

CM Jagan:ప్రతి రైతునూ ఆదుకుంటాం... సీఎం జగన్ భరోసా..

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో

YS Jagan: నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపికబురు

ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్ ప్రభుత్వం వరుస తీపికబురులు అందిస్తుంది. ఉద్యోగ జాతరకు శ్రీకారం చుట్టింది. ఒక్క రోజు వ్యవధిలోనే గ్రూప్-2, గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల చేసి సువర్ణాధ్యాయం లిఖించింది.