BJP Leader Son:ఆస్ట్రేలియాలో తెలంగాణ బీజేపీ నేత కుమారుడు మృతి

  • IndiaGlitz, [Friday,May 24 2024]

ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువకుడి మృతదేహం తాజాగా సముద్రంలో దొరికింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌‌‌‌కు చెందిన దివంగత బీజేపీ నేత అరటి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు అరవింద్ యాదవ్ ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. ఏడాదిన్నర క్రితం అరవింద్‌కు వివాహంకాగా.. ప్రస్తుతం భార్య గర్భిణిగా ఉంది. ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి మే 20న షాద్ నగర్ వచ్చేందుకు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు.

అయితే అరవింద్ కారు వాష్ చేయించుకుని వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు.. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గాలింపు మొదలు పెట్టారు. ఇంతలో అరవింద్ మృతదేహం సముద్రంలో లభ్యమైంది. అతడి కారును కూడా సమీపంలోనే గుర్తించారు. పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి అరవింద్ డెడ్‌బాడీ అని గుర్తించారు. అతడిది హత్యా?..ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అరవింద్ అకాల మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా అరవింద్ తండ్రి కృష్ణ యాదవ్ 2006 ఏప్రిల్ 7న ఏలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కృష్ణ భార్య, అరవింద్ తల్లి ఉషారాణి షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. భర్త మరణం తర్వాత ఒక్కగానొక్క కుమారుడ్ని బాగా చదివించారు.. ఆస్ట్రేలియాలో ఉద్యోగం, ఆ తర్వాత పెళ్లి చేశారు. అరవింద్ జీవితంలో బాగా స్థిరపడ్డాడు అనుకుంటున్న సమయంలో ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

More News

Pinnelli:హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట.. అజ్ఞాతం వీడనున్నారా..?

పోలింగ్ ముగిసినా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఘర్షణలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని

Buddha Venkanna:లోకేష్‌కు టీడీపీ బాధ్యతలు అప్పగించాలి.. బుద్ధా వెంకన్న హాట్ కామెంట్స్..

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నారా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించాలని

Karate Kalyani:డ్రగ్స్‌ టెస్టులో హేమకు పాజిటివ్.. సినీ నటి కరాటే కల్యాణి తీవ్ర ఆగ్రహం

తెలుగు న‌టి హేమ బెంగుళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్‌ పార్టీకి హేమతో

Komatireddy Venkat Reddy:జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం: కోమటిరెడ్డి

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో కుటుంబసభ్యులు..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుడివాడలోని తన స్వగృహంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ అకస్మాత్తుగా సోఫాలో