తీన్మార్ సావిత్రి ప్రేమ కథ.. కన్నీటి ప్రవాహమే!

  • IndiaGlitz, [Saturday,August 03 2019]

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-03 ఇప్పటి వరకూ గొడవలతో అరుపులతో ఎపిసోడ్ ముగిసిపోయేది. అయితే శుక్రవారం మాత్రం ఈ షో చూసిన వాళ్లంతా కంటతడిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా 15 మంది కంటెస్టెంట్లు వారివారి జీవితంలో జరిగిన చేదు ఘటనలు, ప్రేమ కథలు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. వాళ్లు ఏడవటమే కాదు.. షో చూస్తున్న బిగ్‌బాస్ ప్రియులను సైతం ఏడిపించేశారు. ఈ సందర్భంగా శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి తన ప్రేమ కథను చెప్పింది. ఈ కథ విన్న వీక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

సావిత్రి ప్రేమ కథ..!

నాకు ఇష్టమైన వ్యక్తిని ప్రేమించినందుకు ఒక్క నాలుక మీద తప్ప శరీరం మొత్తం దెబ్బలు తిన్నాను. ఎవరైనా ప్రేమిస్తే నిన్ను చంపేస్తాం అంటారు. కానీ నేను ప్రేమించిన వాడిని చంపేస్తానని బెదిరించారు. అలా ఊరంతా ఒకవైపు.. నేను ఒక్కదాన్ని నా ప్రేమికుడు వైపు ఉండి చివరికి కోరుకున్నవాడితో వచ్చేశాను అని చెప్పిన సావిత్రి ఒకింత భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టేసింది. ఇలా అందరు కంటెస్టెంట్లు వారి జీవితాల్లో జరిగిన చేదు ఘటనలను, ప్రేమ కథలను చెప్పారు.

మరోవైపు.. మహేష్ విట్టా తన స్నేహితుడ్ని కోల్పోయిన సందర్భాన్ని చెప్పి భావోద్వేగానికి లోనయ్యారు. పునర్నవి తనను ప్రేమించిన వాడిని కోల్పోయిన సందర్భాన్ని, వితికా వాళ్ల పిన్ని గురించి, వరుణ్ వాళ్ల నాన్న గురించి, రవిక్రిష్ణ, జాఫర్, బాబా భాస్కర్‌లు వాళ్ల ఫ్యామిలీ గురించి గుర్తు చేసుకుని ఎమోషనల్‌గా మాట్లాడారు. మొత్తానికి నేటి ఎపిసోడ్‌ మొత్తం చాలా భావోద్వేగంతో నడిచింది. కాగా ఇవాళ లేదా రేపు... రాహుల్‌, జాఫర్‌, శ్రీముఖి, వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు, మషేష్‌ విట్టా, పునర్నవి భూపాలం, హిమజలలో ఒకరు లేదా ఇద్దరు బిగ్‌బాస్ హౌస్ వీడబోతున్నారు. అయితే ఆ ఒకరు లేదా ఇద్దరు ఎవరనేది ఇవాళ్టి ఎపిసోడ్‌లో చూడాల్సిందే మరి.

More News

టీడీపీకి దేవినేని రాజీనామా.. జగన్ సమక్షంలో వైసీపీలోకి!

తెలుగు యువత అధ్యక్షుడు, మంత్రిగా కొడాలి నానినే ఢీ కొన్న నేత దేవినేని అవినాష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.!

రాజకీయాలకు ‘ఇక సెలవు’ అంటున్న కుమారన్న!

అవును మీరు వింటున్నది నిజమే.. కర్నాటక మాజీ సీఎం హెచ్‌ డీ కుమారస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఓ మూర్ఖపు భక్తుల్లారా.. రాముడి పేరును అపవిత్రం చేయకండి..!

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ మతం ఆధారంగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

'కథనం' ట్రైలర్ లాంచ్

ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కథనం'.

మళ్లీ వార్తల్లోకి ప్రభాస్ పెళ్లి..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఒకరైన ప్రభాస్ పెళ్లి గురించి ఎక్కడా ఊసెత్తం లేదు. నాలుగు పదుల వయసును ఈ స్టార్ రీచ్ కాబోతున్నాడు.