స్పీడ్ పెంచిన టెక్ మహీంద్ర.. రెండు కంపెనీల్లో వాటాలు

  • IndiaGlitz, [Tuesday,April 09 2019]

దేశీయ ఐటీ సంస్థ, ఐటీ సేవల దిగ్గజం టెక్‌ మహీంద్రా వాటాల కొనగోళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం నాడు మరో రెండు కంపెనీల్లో వాటాలు కొనగోలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఈ రెండు కంపెనీల్లో ఇన్ఫోటెక్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సిస్టమ్స్‌, విటారన్‌ ఎలక్ట్రానిక్స్‌, ఐఎస్‌ఎస్‌ అండ్‌ విటరన్‌ ఎలక్ట్రానిక్స్‌లో 18.1శాతం వాటా కొనుగోలు చేయడానికి అంగీకారం టెక్ మహీంద్ర తెలిపింది. ఈ డీల్‌ విలువ రూ.13కోట్లు. 2000 సంవత్సరంలో ఈ ఐఎస్‌ఎస్‌ను ప్రారంభించడం జరిగింది. ఈ కంపెనీ ద్వారా ఆర్‌ఎఫ్‌ఐడీ పరికరాలను చేసి విక్రయిస్తుంది.

దీంతో ఏం లాభం.. !?

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ విభాగంలో అడుగు పెట్టడం

ఆస్తులను ట్రాక్‌ చేయడం, పర్యవేక్షించడం, ఆటోమేటెడ్‌ బిల్లింగ్‌ విభాగాల్లో సేవలు అందించే అవకాశం

స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల్లో టెక్‌ మహీంద్రా కూడా వాటాలు పొందేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది.