అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ .. ఎవరెవరంటే..?

  • IndiaGlitz, [Tuesday,March 15 2022]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఈరోజు కూడా స్పీకర్ సస్పెండ్ చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ తీర్మానానికి అనుగుణంగా.. దీనిపై స్పీకర్‌ చర్యలు తీసుకున్నారు.

దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వెలగపూడి రామకృష్ణబాబు, బెందాళం అశోక్‌, గొట్టిపాటి రవికుమార్‌, ఆదిరెడ్డి భవాని, గణబాబు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌, ఎం. రామరాజు, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌లను శాసనసభ నుంచి ఒక్కరోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని ప్రకటించారు. సోమవారం ఐదుగురు తెదేపా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. వారిపై బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ వేటు వేశారు. తాజాగా మిగిలిన సభ్యులను ఈ ఒక్కరోజు సభ నుంచి సస్పెండ్‌ చేశారు.

నిన్న ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. వారిపై బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ వేటు వేశారు స్పీకర్. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలపై చర్చ జరపాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీనిపై సభలో ప్రభుత్వం ప్రకటించినా విపక్షం శాంతించలేదు. పోడియం చుట్టూ చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో వీరిని బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.

More News

మీరు బాలీవుడ్‌ను పక్కకునెట్టేశారు... ది కశ్మీర్ ఫైల్స్‌ దర్శకుడిపై ఆర్జీవీ ప్రశంసలు

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ .. ఇటీవలి కాలంలో మళ్లీ జోరు పెంచారు.

పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. అభిమాని కుటుంబానికి ఆర్ధిక సాయం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ మరణించిన తన  అభిమాని కుటుంబాన్ని ఆదుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా `హైవే` మూవీ కొత్త పోస్టర్ విడుదల

యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా `హైవే`. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రంలో

హీరో ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా  'బేబీ' సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'.  ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

జగన్‌తో రాజమౌళి, డీవీవీ దానయ్య భేటీ: టాలీవుడ్ అటెన్షన్, ఈ కలయిక ‘ఆర్ఆర్ఆర్’ కోసమేనా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య కలిశారు.