TDP Jana Sena:ఏపీలో రోడ్ల దుస్థితిపై టీడీపీ-జనసేన ఉమ్మడి పోరు షూరూ

  • IndiaGlitz, [Saturday,November 18 2023]

ఏపీలో రోడ్ల దుస్థితిపై టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో 'గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది సీఎం' పేరుతో ఉమ్మడి నిరసనలు చేపట్టారు. ఇవాళ(శనివారం), రేపు (ఆదివారం) రెండు పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి రావాలిని, ఎక్కడ గుంత కనిపిస్తే అక్కడ సెల్ఫీ దిగాలని సీనియర్ నేతలు పిలుపునిచ్చారు. ఆ ఫొటోలు, వీడియోలు #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు. దీంతో రాష్ట్రంలో అధ్వానంగా తయారైన రహదారులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి తెలిసేలా ఆందోళనకు దిగారు. గుంతల రోడ్ల ఫొటోలు తీసి షేర్ చేస్తున్నారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని రెండు పార్టీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేశాయి. ప్రజాసమస్యలపై కలిసి పోరాటం చేస్తామని ప్రకటించాయి. ఇప్పటికే రెండు పార్టీల నేతలు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు సీనియర్ నేతలు ఉమ్మడి మేనిఫెస్టో కార్యాచరణపైన చర్చించారు. నారా లోకేష్, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి సమన్వయ కమిటీ భేటీ కూడా నిర్వహించి ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలనే దానిపైన సుదీర్ఘంగా చర్చించిన సంగతి తెలిసిందే.

మరోవైపు బీజేపీని కూడా తమ కూటమిలోకి రావాలని పవన్ కల్యాణ్ కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. ఈ క్రమంలో ఏపీలోనూ టీడీపీ-జనసేన కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్తామని బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రానున్నట్లు కమలం నేతలు భావిస్తున్నారు. ఇదే కనక నిజమైతే వైసీపీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగలనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే టీడీపీ-జనసేనతో పోలిస్తే బీజేపీకి పెద్దగా ఓట్లు రాకపోయినా ఎన్నికల సమయంలో కేంద్రం మద్దతు ఉంటే వైసీపీని ధీటుగా ఎదుర్కొనే అవకాశాలుంటాయి. మొత్తానికి చంద్రబాబు అరెస్టుకు ముందు, తర్వాత అనేలా ఏపీ రాజకీయాలు మారిపోయాయి.

More News

Vijayashanthi:బీజేపీలో కేసీఆర్ నాటిన మొక్క ఉంది.. విజయశాంతి సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్‌ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబితే ఆ పార్టీలోకి వెళ్లానని..

Balayya:బాలయ్యతో 'యానిమల్' వైల్డెస్డ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది..

'అన్‌స్టాపబుల్ విత్ NBK' టాక్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటీటీలో ఏ టాక్‌ షోకు రాని రికార్డులు ఈ షోకు వచ్చాయి.

MLC Kavitha:తీవ్ర అస్వస్థతతో స్పృహతప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో రోడ్ షో నిర్వహించారు.

Nani:రాజకీయ నాయకుడిగా మారిన హీరో నాని.. ఎందుకంటే..?

తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనపడుతోంది. ఏ గల్లీ చూసినా పార్టీల ప్రచారాలతో హోరెత్తుతోంది.

Vijayashanthi:కాంగ్రెస్‌లో అలా చేరారో లేదో.. విజయశాంతికి కీలక బాధ్యతలు..

మాజీ ఎంపీ విజయశాంతి నిన్న(శుక్రవారం) కాంగ్రెస్ పార్టీలో అలా చేరారో లేదో ఇవాళ ఆమెకు కీలక పదవి అప్పగించారు.