Chandrababu:టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మరోసారి నిరాశే.. స్కిల్ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

  • IndiaGlitz, [Thursday,October 12 2023]

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విచారణ అక్టోబర్ 9న జరగగా.. నేటికి వాయిదా పడింది. నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

క్వాష్‌ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ..

అటు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ రేపు(శుక్రవారం) జరగనుంది. మంగళవారం జరిగిన విచారణలో ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన ధర్మాసనం రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో రేపు తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్వల్ప ఊరట..

సీఐడీ నమోదు చేసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రింగ్ రోడ్డు కేసులో సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. దీంతో టీడీపీ శ్రేణులకు కొంత ఉపశమనం లభించట్లైంది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా చంద్రబాబు తరపున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని.. కేసుల్లో విచారణకు సహకరిస్తామని కోరారు.

More News

Jagananna Colony: రాష్ట్రానికి గృహ శోభ.. అక్కాచెల్లెమ్మలకు అన్నగా అండగా సీఎం వైయస్ జగన్

రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలబడ్డారు. ప్రతి చెల్లీ, ప్రతి అక్కా సొంత ఇంట్లో ఆత్మగౌరవంతో జీవించాలని ఆయన సంకల్పించారు.

Bigg Boss 7 Telugu : అశ్వినిని నలిపేసిన అమర్‌దీప్ .. ప్రశాంత్ కెప్టెన్సీ గోవిందా, రైతుబిడ్డ కంటతడి

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో సందడి పెరిగింది.

Lokesh:రెండో రోజు ముగిసిన సీఐడీ విచారణ.. సమయం వృథా చేశారని లోకేశ్ ఆగ్రహం

తాడేపల్లి సీఐడీ కార్యాలయంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో రోజు విచారణ ముగిసింది.

Rajasthan Election:రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ తేది మార్పు.. ఎందుకంటే..?

ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే.

God:జయం రవి, నయనతార మూవీ ‘గాడ్’ సెన్సార్ పూర్తి.. అక్టోబర్ 13న రిలీజ్

తనీ ఒరువన్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ తర్వాత జయం రవి, నయన తార హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’.