టార్గెట్ విశాల్... శ్రీరెడ్డి లేటెస్ట్ మిషన్!

  • IndiaGlitz, [Sunday,October 28 2018]

ఎవరో ఒకరిపై విమర్శలు చేయడం ద్వారా వీలైనంత లబ్ది పొందాలని శ్రీరెడ్డి తాపత్రయ పడుతున్నట్టు తెలుగు, తమిళ ప్రజలు సులభంగా గ్రహిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని రోజుల క్రితం అలజడి సృష్టించి, తరవాత తమిళ రాజధాని చెన్నైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. రెండు మూడు తమిళ చిత్రాల్లో శ్రీరెడ్డి నటిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎన్ని విమర్శలు చేసినా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరూ పట్టించుకోవడం లేదు గనుక... తమిళ సినీ ప్రముఖుల్ని టార్గెట్ చేసినట్టున్నారు.

ఆదివారం నడిఘర్ సంఘం, తమిళ చలనచిత్ర నిర్మాతల మండలిలో చక్రం తిప్పుతున్న విశాల్ మీద పడ్డారు. వరుస ట్వీట్స్ చేశారు. అయితే ఎక్కడా విశాల్ పేరు ప్రసావించలేదు. కానీ, శ్రీరెడ్డి ట్వీట్స్ చదివితే.. ఆమె విశాల్‌ని టార్గెట్ చేశారని సులభంగా అర్థమవుతుంది. తమిళ నిర్మాతలు నీపై నమ్మకం పెట్టుకున్నారు. నీకు ఓటు వేశారు. కానీ, నువ్వు నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావ్. డబ్బు కోసం చాలామంది తమిళ నిర్మాతలను వేధిస్తున్నావ్. ఒక్క విషయం గుర్తు పెట్టుకో... నిర్మాతలకు కోపం వచ్చేవరకూ నువ్వు సేఫ్. ఒక్కసారి వాళ్లకు కోపం వస్తే... హీరోగా నీ సీటు, నీ ఎమ్మెల్యే సీటు, అన్నీ గల్లంతు అవుతాయి అని శ్రీరెడ్డి ట్వీట్ చేశారు. వీటిపై విశాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

More News

అలీ హీరోగా 'పండుగాడి ఫోటో స్టూడియో' (వీడు పోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది) ప్రారంభం

'యమలీల' చిత్రంతో హాస్య కథానాయకుడిగా నిరూపించుకున్న అలీ హీరోగా మళ్ళీ పూర్తీ వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న 'పండుగాడి ఫోటో స్టూడియో' చిత్రం

మహేష్ మ‌ల్టీప్లెక్స్‌లో అమితాబ్-ఆమిర్ సినిమా!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు థియేటర్ బిజినెస్‌లోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్ భాస్వామ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ ప్రారంభించిన మ‌ల్టీప్లెక్స్‌ నిర్మాణం పూర్తయ్యింది.

అల్లువారింట అట్లతద్ది!

తెలుగులో స్టయిలిష్ స్టార్ ఎవరు? అని అడిగితే ఎవరైనా అల్లు అర్జున్ పేరే చెబుతారు! స్టయిల్‌కి అల్లు అర్జున్ కేరాఫ్ అడ్రస్ అన్నట్టు ఉంటారు.

విజయ్ దేవరకొండకు హిందీ హీరో కాంప్లిమెంట్‌!

'అర్జున్‌రెడ్డి' అంటే విజయ్ దేవరకొండ... విజయ్ దేవరకొండ అంటే 'అర్జున్‌రెడ్డి' అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

చంద్రోదయం చిత్రీకరణ పూర్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతొన్న చిత్రం 'చంద్రోదయం'. ఈ బయోపిక్ ను పి.వెంకటరమణ దర్శకత్వంలొ జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు.