నిర్మాత రామ్మోహన్ పి. స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న' తను నేను' షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,November 11 2015]

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్‌ పి. ఇప్పుడు దర్శకుడుగా మారారు. అవికా గోర్‌ హీరోయిన్‌గా, 'వర్షం' దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'తను నేను' షూటింగ్‌ పూర్తయింది.

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను దీపావళి కానుకగా ఈరోజు విడుదల చేశారు. నవంబర్‌ 11 నుండి 'అఖిల్‌' చిత్రంతోపాటు 'తను నేను' ట్రైలర్‌ కూడా ప్రదర్శించబడుతుంది. సన్ని ఎం.ఆర్‌. సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో నవంబర్‌ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అవికా గోర్‌, సంతోష్‌ శోభన్‌, అల్లరి రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్‌.కె. మామ, రాజశ్రీనాయుడు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: సురేష్‌ సారంగం, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్‌: ఎస్‌.రవీందర్‌, నిర్మాణం: సన్‌షైన్‌ సినిమాస్‌ ప్రై. లిమిటెడ్‌, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ లిమిటెడ్‌, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాత-దర్శకత్వం: రామ్మోహన్‌ పి.

More News

నవంబర్ 19 నుండి స్పెయిన్ లో 'నాన్నకు ప్రేమతో...'

యంగ్టైగర్ ఎన్టీఆర్,ఆర్య సుకుమార్ కాంబినేషన్ లో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ ఎల్ పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'.

రామ్ హరికథ మారింది

రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హరికథ.ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు.స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

అఖిల్ మూవీ రివ్యూ

అఖిల్ అక్కినేని అనే పేరు ఇటీవలి కాలంలో సినిమా పరిశ్రమలోనే కాదు... సర్వత్రా ఆసక్తిగా వినిపిస్తున్న పేరు. అక్కినేని మూడో తరం కథానాయకుడిగా సినిమా పరిశ్రమకు పరిచయం కానున్నారు అఖిల్. అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున కొడుకు, అక్కినేని నాగచైతన్య తమ్ముడు..

సంక్రాంతికి పక్కా అంటున్న 'డిక్టేటర్'

నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న చిత్రం ‘డిక్టేటర్’. బాలకృష్ణ 99వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

నిత్యాకి ఇది మళ్లీ మళ్లీ రాని సంవత్సరమే

సౌత్ లోని అన్ని భాషల్లోనూ నటిగా తన సత్తాని చాటుకుంది కేరళ కుట్టి నిత్యా మీనన్.అయితే..ఈ సంవత్సరం మాదిరిగా మరే సంవత్సరం నిత్యాకి విజయాలను,గుర్తింపుని తీసుకురాలేదనే చెప్పాలి.