నా దగ్గర 8.55 కిలోల బంగారం ఉంది: ఖుష్బూ

  • IndiaGlitz, [Saturday,March 20 2021]

తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్ హడావుడి కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరుఫున ప్రముఖ సినీ నటి ఖుష్బూ థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన వద్ద 8.55 కిలోల బంగారు నగలున్నాయని ఖుష్బూ... ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ఈ నగల విలువ రూ.3.42 కోట్లు ఉంటుందని తెలిపారు. తన ఖాతాలో రూ2.15 లక్షల నగదు ఉందని, సుమారు రూ.40 లక్షల విలువ చేసే రెండు లగ్జరీ కార్లు ఉన్నాయన్నారు. తన పేరిట రూ.4.55 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఖుష్బూ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గురువారం చెన్నై థౌజెండ్‌లైట్స్‌ నియోజకవర్గంలో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు.  

కాగా.. ఖుష్బూ ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపిన ఖుష్బూ... కొన్ని గంటల తర్వాత... బీజేపీ ఆఫీసుకు వెళ్లి... ఆ పార్టీలో చేరిపోయారు. సినిమాల ద్వారా దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న కుష్బూ అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికారిక ప్రతినిధిగా పనిచేశారు. ఈ పార్టీలో ఉంటూనే ఆ మధ్య కేంద్రం తెచ్చిన కొత్త విద్యాపాలసీని సమర్ధించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ కుష్బూపై సీరియస్ అయ్యింది. అప్పటి నుంచే కుష్బూ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఆ తరువాత కొద్ది రోజులకే ఖుష్బూ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.

ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే రెండు సార్లు అధికారాన్ని దక్కించుకున్న అన్నాడీఎంకే మరోసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని వ్యూహాలు పన్నుతోంది. డీఎంకే సైతం ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే కసితో ప్రతివ్యూహాలు పన్నుతోంది. దీంతో డీఎంకే, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోగా... అన్నాడీఎంకే, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ రెండింటి మధ్య పోటీ నువ్వా-నేనా? అన్నట్టుగా ఉంది. అయితే విజయావకాశాలు డీఎంకేకే మెండుగా ఉన్నాయని సమాచారం. ఒకవైపు అన్నాడీఎంకేపై వ్యతిరేకత ఉండగా.. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ రెండూ కలిసి బరిలోకి దిగాయి కాబట్టి డీఎంకేకి పరిస్థితులు ఫేవర్‌గా మారే అవకాశముందని సమాచారం.

More News

‘జాతిరత్నాలు’ అదరగొడుతున్న స్పెషల్ సాంగ్...

చాలా కాలం తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి కడుపుబ్బ నవ్వుకున్నారంటే దానికి కారణం ‘జాతిరత్నాలు’.

సందడిగా ‘రంగ్‌దే’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. నితిన్‌కు అభిమాని ఆసక్తికర ప్రశ్న..

అశేష అభిమానుల మ‌ధ్య క‌ర్నూలులో గ్రాండ్‌గా 'రంగ్ దే' ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ జరిగింది. ఆద్యంతం న‌వ్వుల‌తో ఈ ట్రైలర్ అల‌రించింది.

'చావు కబురు చల్లగా'కు ఝలక్ ఇచ్చిన పోలీసులు

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా.. కౌశిక్ పెగ‌ళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఆమని, మురళి శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇట‌లీలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ర‌వితేజ‌ 'ఖిలాడి'

'క్రాక్' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, 'రాక్ష‌సుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో

ఏపీ నగరపాలక సంస్థల మేయర్‌ల విషయంలో ఆసక్తికర విషయాలివే..

ఏపీలోని నగరపాలక సంస్థల్లో కొత్త మేయర్లు కొలువుదీరిన విషయం తెలిసిందే. అయితే దీనిలో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.