ప‌వ‌న్ చిత్రంలో త‌మిళ హీరో...?

  • IndiaGlitz, [Sunday,April 26 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ను ‘వ‌కీల్‌సాబ్‌’గా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. మ‌రో ప‌క్క రీసెంట్‌గానే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ త‌న 27వ సినిమాను స్టార్ట్ చేసినట్లు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఈలోపు క‌రోనా వైర‌స్ విజృంభించ‌డంతో రెండు సినిమాల షూటింగ్‌ల‌ను ప‌వ‌న్ ఆపేశారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమా ట్రాక్ ఎక్కనుంది. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

తాజాగా సినీ వ‌ర్గాల్లో ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో త‌మిళ హీరో శివ కార్తీకేయ‌న్ న‌టించ‌బోతున్నాడ‌ని. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. ఓ హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండెజ్ న‌టిస్తుండ‌గా మ‌రో హీరోయిన్ పాత్ర‌లో నివేదా పేతురాజ్ న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ను నిర్మించారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

More News

సినీ నృత్య కళాకారులకు రాఘవ లారెన్స్ 5,75,000 ఆర్థిక సహాయం

పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో

కరోనా నేపథ్యంలో ప్రాణాల మీదికి తెస్తున్న అష్టాచమ్మ, పేకాట!

కరోనా వైరస్‌ ఎంత ప్రమాదకరంగా ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇటీవలే.. కరోనా మహమ్మారి ఎంత ప్రమాదమో

ప‌వ‌న్‌కు పొలిటిక‌ల్‌గా చిరు స‌ల‌హాలిచ్చారా?

అన్న‌య్య చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన త‌ర్వాత త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ రాజ‌కీయ పార్టీ

బ‌న్నీసెకండ్ హీరోయిన్‌... అంతా రూమ‌రేన‌ట‌!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది

రౌడీ హీరో క్వారంటైన్ టైమ్ వీడియో

ప్రస్తుతం టాలీవుడ్‌లో బీ ద రియ‌ల్ మేన్ అనే ఛాలెంజ్ ట్రెండ్‌లో ఉంది. సందీప్ వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ రాజ‌మౌళి నుండి విస్త‌రిస్తూ వ‌స్తుంది.