తమన్నా గుర్రపు స్వారీ...

  • IndiaGlitz, [Friday,June 10 2016]

మిల్కీ బ్యూటీ తమన్నా బాహుబలి2 కోసం బాగా కష్టపడుతోంది. చిత్రీకరణ యాక్షన్ పార్ట్ ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలకు సంబంధించినది కావడంతో దర్శకుడు రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట. జూలైలో జరగనున్న చిత్రీకరణలో తమన్నా ఈ చిత్రీకరణలో పాల్గొననుంది. అందులో భాగంగా ప్రస్తుతం చిత్రంలో నటిస్తున్న స్టంట్ పర్సన్ జిత్తువర్మ వద్ద గుర్రపుస్వారీ నేర్చుకుంటుంది. కత్తిసామును హాలీవుడ్ స్టంట్ శిక్షకుడు లీ వద్ద నేర్చుకోనుందట. ప్రస్తుతం అయితే తాను గుర్రపుస్వారీలో బిజీగా ఉన్నానని తమన్నా చెప్పుకొచ్చింది. అయితే ఈసారి డమ్మీ కత్తులతో కాకుండా బరువైన కత్తులతో శిక్షణ పొందుతున్నట్లు తెలియజేశారు. గుర్రంపై వెళుతూ యుద్ధం చేసే సన్నివేశాల కోసం ఈ శిక్షణ తీసుకుంటుందట. ఈ చిత్రాన్ని 2017 ఏప్రిల్ 14న విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

More News

హ్యాపీ బర్త్ డే టు నందమూరి బాలకృష్ణ

నేటి తరం హీరోల్లో నటనలో వాడి,డైలాగ్స్ లో పవర్ తో ప్రేక్షకుడిని థియేటర్ వైపు అడుగులు వేయిస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ.

'రైట్ రైట్' కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శుభాకాంక్షలు

క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ నటించిన తాజా చిత్రం 'రైట్ రైట్'.వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్ టైన్ మెంట్స్ ప తాకంపై జె.వంశీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం రేపు (10.06.)

తేజు డైరెక్ట‌ర్ తో రామ్..

నేను శైల‌జ సినిమాతో స‌క్సెస్ సాధించిన ఎన‌ర్జిటిక్ హీరో రామ్ కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంది.

నందు నూతన చిత్రం కన్నుల్లో నీ రూపమే

యంగ్ టాలెంటెడ్ హీరో నందు, కన్నడ భామ తేజస్వినీ ప్రకాష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం క‌న్నుల్లో నీ రూప‌మే. నూతన దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సెన్సేషనల్ మూవీ 'దండుపాళ్యం-2' షూటింగ్ పూర్తి - ఆగస్ట్ లో రిలీజ్

వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా 30 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.