విక్రమ్ తో మిల్కీ బ్యూటీ

  • IndiaGlitz, [Tuesday,January 31 2017]

విల‌క్ష‌ణ న‌టుడుగా పేరున్న వారిలో చియాన్ విక్ర‌మ్ ఒక‌డు. అందుకే తెలుగు, త‌మిళంలో విక్ర‌మ్ సినిమాల‌కు మంచి క్రేజ్ ఉంటుంది. విక్ర‌మ్ గ‌త చిత్రం ఇంకొక్క‌డు సినిమా వంద కోట్ల‌ను క‌లెక్ట్ చేసి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం చియాన్ విక్ర‌మ్ విజయ్ చంద్రశేఖర్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌వి న‌టిస్తుంద‌ని, వార్త‌లు వినిపించాయి. అంతా ఒకే అనుకుంటున్న స‌మ‌యంలో కార‌ణాలు తెలియ‌లేదు కానీ సాయిప‌ల్ల‌వి ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది.

ఇప్పుడు సాయిప‌ల్ల‌వి స్థానంలో విక్ర‌మ్‌తో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌నుంది. విక్ర‌మ్‌, త‌మ‌న్నా కాంబినేష‌న్‌లో రానున్న తొలి చిత్రం కూడా ఇదే. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళంలో క్వీన్ రీమేక్‌లో టైటిల్ పాత్ర పోషించ‌డానికి రెడీ అవుతున్న త‌మ‌న్నాకు విక్ర‌మ్‌తో క‌లిసి తెర‌ను పంచుకోనుండ‌టం ఇంకా పెద్ద అడ్వాంటేజ్ అయిన‌ట్లే. ఈ సినిమాతో పాటు విక్ర‌మ్, గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ధృవ‌న‌క్ష‌త్రం సినిమా కూడా చేస్తున్నాడు.

More News

నాని డైరెక్టర్ తో శర్వానంద్....

ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో హీరో నాని సేఫ్ జోన్ హీరోగా నిలిచాడు.

తారక్ నాప్రాణం అంటున్న యువ హీరో..!

తారక్ నా ప్రాణం అంటున్న యువ హీరో ఎవరో కాదు..మంచు మనోజ్.

ఎన్టీఆర్ హీరోయిన్ కన్ ఫర్మ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సర్ధార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సాయిధరమ్ తేజ్ జవాన్ ప్రారంభం..!

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రచయిత బి.వి.ఎస్ రవి దర్శకత్వంలో జవాన్ చిత్రం

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ కొత్త చిత్రం ప్రారంభం

`ధృవ` వంటి సూప‌ర్‌డూప‌ర్‌హిట్ మూవీ తర్వాత మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మాత‌లుగా కొత్