సందీప్ కిషన్ తో మిల్కీబ్యూటీ...

  • IndiaGlitz, [Monday,May 29 2017]

రీసెంట్‌గా మాన‌గ‌రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న సందీప్ కిష‌న్‌, కృష్ణ‌వంశీ న‌క్ష‌త్రం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఇది కాకుండా మంజుల ద‌ర్శ‌క‌త్వంలో త్రిదాచౌద‌రి, అమైరా ద‌స్త‌ర్‌ల‌తో ఓ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాలు కాకుండా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు కునాల్ కోహ్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. హ‌మ్ తుమ్ వంటి బాలీవుడ్ చిత్రాన్ని తెర‌కెక్కించిన కునాల్ కోహ్లి తెలుగులో తొలిసారి చేయ‌నున్న సినిమాలో సందీప్ కిష‌న్ స‌ర‌స‌న త‌మ‌న్నా జోడి క‌ట్ట‌నుంది. ప్ర‌స్తుతం స్టార్ హీరోల ప‌క్క‌నే న‌టిస్తున్న త‌మ‌న్నా, సందీప్ సినిమాలో చేయ‌డం ఓ ర‌కంగా సినిమాకు పెద్ద ప్లస్ అనే చెప్పాలి.