రకుల్ లాగే తమన్నాకి కూడా కలిసొస్తుందా?

  • IndiaGlitz, [Monday,April 30 2018]

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. నయనతార, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి ఇత‌ర ముఖ్య తారాగణంగా  రూపొందుతున్న ఈ సినిమాకి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన 'ఊసరవెల్లి' మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. మరి ఇప్పుడు రెండోసారి వీళ్ళ కాంబినేషన్‌లో వస్తున్న ‘సైరా’తోనైనా ఈ కాంబో విజయం సాధిస్తారేమో చూడాలి.

ఇంత‌కుముందు ఇటువంటి పరిస్థితే రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఎదురైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘కిక్2’లో నాయిక‌గా నటించిన రకుల్‌కు.. ఆ సినిమా అంతగా కలిసి రాలేదు. కాని ఆ తర్వాత వచ్చిన 'ధృవ'తో ఈ కాంబినేషన్ విజయాన్ని అందుకుంది.

ఈ నేప‌థ్యంలో.. ఇప్పుడు తమన్నా విషయంలో కూడా అటువంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ర‌కుల్‌, సురేంద‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రెండో చిత్రంలో చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తే.. త‌మ‌న్నా, సురేంద‌ర్ కాంబోలో వ‌స్తున్న రెండో చిత్రంలో చిరంజీవి హీరో కావ‌డం.

More News

విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు

విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ  2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే.

చ‌ర‌ణ్ చిత్రంలో సుదీప్‌?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ చిత్రాల‌ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

'యాత్ర'లో 'బాహుబలి 2' యాక్ట్ర‌స్‌

సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

'యముడికి మొగుడు'కి 30 ఏళ్ళు

ధర్మాన్ని పాటించే యమధర్మరాజు తప్పు చేస్తే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమే 'యముడికి మొగుడు'.

ర‌వితేజ హీరోయిన్ వైపే మొగ్గు చూపుతున్న రామ్‌

ఎన‌ర్జిటిక్‌ స్టార్ రామ్ హీరోగా పి.ఎస్‌.వి. గ‌రుడ‌వేగ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.