త‌మ‌న్నా ఆ అవ‌కాశం ద‌క్కించుకుంటే..

  • IndiaGlitz, [Tuesday,May 08 2018]

‘శ్రీ’ (2005)  చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక తమన్నా. 2007లో విడుద‌లైన‌ ‘హ్యాపీడేస్’తో నాయిక‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే.. 2011లో వచ్చిన ‘100% లవ్’తో తమన్నా కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఈ సినిమా అందించిన విజ‌యంతో.. ఈ తరంలో అగ్ర కథానాయకులైన పవన్ కల్యాణ్, మహేశ్ బాబు,  ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్,  అల్లు అర్జున్, రవితేజతో కలిసి నటించే అవ‌కాశాల్ని ఒక్కొక్క‌టిగా అందిపుచ్చుకుంది. ఇప్పుడు  ఇదే వ‌రుస‌లో.. సీనియర్ అగ్ర కథానాయకులతోనూ కలిసి నటించే అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటోంది త‌మ‌న్నా.

ఈ క్ర‌మంలో.. ఇప్పటికే నాగార్జునతో కలిసి నటించింది త‌మ‌న్నా. హీరోయిన్‌గా కాకపోయినా 2016లో వచ్చిన ‘ఊపిరి’ సినిమాలో నాగార్జునతో కలిసి స్క్రీన్‌ను పంచుకుంది.  ఇదే వరుసలో.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది ఈ మిల్కీ బ్యూటీ.  అంతేగాకుండా, తాజాగా.. వెంకటేష్‌కు జోడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్-2’లో కథానాయికగా ఎంపికైంది. ఇక ఈ అగ్ర కథానాయకులలో మిగిలింది ఒక్క‌ బాలకృష్ణ మాత్రమే. ఒక‌వేళ బాలయ్య‌తో కూడా కలిసి నటించే అవకాశం వస్తే.. రెండు తరాల అగ్ర హీరోలతో కలిసి నటించిన తొలి హీరోయిన్‌గా తమన్నా ఓ సెన్సేష‌న్‌ సృష్టిస్తుంది.

More News

ఎస్‌.గోపాల్ రెడ్డి త‌న‌యుడు భార్గ‌వ మృతి

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భార్గవ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ అధినేత ఎస్‌.గోపాల్ రెడ్డి త‌న‌యుడు భార్గ‌వ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు

‘అర్జున్ రెడ్డి’ విజయంతో యూత్ స్టార్‌గా ఎదిగారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ యంగ్ హీరో.

పూరీకి ఈసారైనా కలిసొస్తాడా?

‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన సంగీత దర్శకుడు సందీప్ చౌతా.

న‌టుడిగా ప్ర‌తి సినిమాకు నేర్చుకుంటూనే ఉన్నాను - ఆకాశ్ పూరి

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌

'మహానటి'.. ఆ జాబితాలో చేరుతుందా?

మే 9.. తెలుగు సినిమాకు కలిసొచ్చిన తేదీల్లో ఒకటి. ఈ తేదీన విడుద‌లైన  కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించాయి.