జాగ్వార్ లో మిల్కీబ్యూటీ స్పెష‌ల్ సాంగ్ పూర్తి

  • IndiaGlitz, [Saturday,September 24 2016]

మాజీ ప్రధాని దేవ‌గౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం జాగ్వార్. హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చెన్నాంబిక ఫిలింస్‌ పతాకం పై రూపొందుతున్న జాగ్వార్ చిత్రానికి రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో భారీసెట్‌లో హీరో నిఖిల్‌కుమార్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నాల‌పై ఈ స్పెష‌ల్‌సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ స్పెష‌ల్ సాంగ్ సినిమాలో మ‌రో హైలైట్‌గా నిల‌వ‌నుంది. ఈ సాంగ్‌ను చిత్రీక‌రించ‌డంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా అక్టోబర్‌ 6న వరల్డ్‌వైడ్‌గా జాగ్వార్‌ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌, ఆదిత్యమీనన్‌, భజ్రంగ్‌ లోకేష్‌, అవినాష్‌, వినాయక్‌ జోషి, ప్రశాంత్‌, సుప్రీత్‌ రెడ్డి, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్‌, సినిమాటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, మ్యూజిక్‌: యస్‌.యస్‌. థమన్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్‌: రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్‌: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్‌.

More News

50 రోజులు పూర్తి చేసుకున్న శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు..!

అల్లు శిరీష్ హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు.

చిరు - వినాయ‌క్ ల‌ ఠాగూర్ కు 13 ఏళ్లు..!

మెగాస్టార్ చిరంజీవి - డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ కాంబినేష‌న్లో రూపొందిన సెన్సేష‌న‌ల్ మూవీ ఠాగూర్. ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న శ్రియ‌, జ్యోతిక న‌టించారు.

శ‌ర్వానంద్ పై జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదు..!

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌త‌మానంభ‌వ‌తి సినిమాలో న‌టిస్తున్నారు.

టైటిల్ కి త‌గ్గ‌ట్టు హై ప‌వ‌ర్ చూపించిన రామ్..!

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ హైప‌ర్. ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టించింది.

ప‌వ‌న్ త‌మ్ముడుగా క‌మ‌ల్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ `కాట‌మ‌రాయుడు` సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డాలీ ద‌ర్శ‌కుడు. ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ప్రేమ‌క‌థ‌గా సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.