తాప్సీ ప‌ని పూర్తి

  • IndiaGlitz, [Tuesday,December 04 2018]

సొట్ట బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ ద‌క్షిణాది, ఉత్త‌రాదిన మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. 'బేబి', 'నామ్ ష‌బానా', 'పింక్‌', 'జుడ్వా 2' చిత్రాల‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు, త‌మిళంలో 'గేమ్ ఓవ‌ర్‌' అనే సినిమాను పూర్తి చేసింది.

అక్టోబ‌ర్ రెండో వారంలో ప్రారంభమైన ఈ సినిమాను లాంగ్ షెడ్యూల్‌లోనే పూర్తి చేసేశారట‌. ఈ సినిమా గురించి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తాప్సీ తెలియ‌జేస్తూ వీల్ చెయిర్‌లోనే కూర్చుని న‌టించ‌డం అనేది మర‌చిపోలేని ఎక్స్‌పీరియెన్స్. నా ప‌నిని పూర్తి చేశాను. మంచి జ్ఞాప‌కాల‌తో వెళుతున్నాను అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేసింది తాప్సీ.

రిలయ‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అసోసియేష‌న్‌తో గురు, శ‌శికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు న‌య‌న‌తార‌తో 'మ‌యూరి' అనే సినిమాను డైరెక్ట్ చేసిన అశ్విన్ శ‌ర‌వ‌ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

More News

వంద‌కిలోల ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వంద కిలోల బ‌రువు పెరిగాడ‌ని స‌మాచారం. ఆయ‌న రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న మల్టీస్టార‌ర్ 'ఆర్ ఆర్ ఆర్‌'. ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది.

వెండితెర‌కు స‌న్నిలియోన్ సోద‌రి..

హాలీవుడ్ శృంగార తార స‌న్నిలియోన్ ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది సినిమాల్లోనూ కూడా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా స‌న్నిలియోన్ సోద‌రి మియా రాయ్ లియోన్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుంది.

లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ అందుకున్న యస్ పి బాల సుబ్రమణ్యం

ప్రముఖ గాయకులు శ్రీ యస్ పి బాల సుబ్రమణ్యం గారికి ప్రతిష్టాత్మక లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ని ఇండీవుడ్ సంస్థ హైదరాబాద్ లోని హైటెక్స్  ప్రాంగణంలో అంద జేయడం జరిగింది.

'యు' ఈ నెల 14న రిలీజ్

కొవెర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన  చిత్రం 'యు'. శ్రీమ‌తి నాగానిక చాగంరెడ్డి స‌మ‌ర్పించారు. విజ‌య‌ల‌క్ష్మీ కొండా నిర్మాత‌. కొవెర ద‌ర్శ‌కుడు. ఆయ‌నే హీరోగా న‌టించారు.

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌వ‌చం సెన్సార్ పూర్తి.. 'U/A' స‌ర్టిఫికేట్.. 

బెల్లంకొండ శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ జంట‌గా న‌టించిన క‌వ‌చం చిత్ర సెన్సార్ పూర్త‌యింది. ఎలాంటి క‌ట్స్ లేకుండా 'U/A' స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది ఈ చిత్రం.