య‌స్‌.వి.ఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు జులై 3న‌

  • IndiaGlitz, [Wednesday,June 27 2018]

వెండితెర విల‌క్ష‌ణ న‌టుడు య‌స్‌.వి.ఆర్‌. శ‌త‌జ‌యంతి వేడుక‌లు జులై 3న జ‌ర‌గ‌నున్నాయ‌ని 'సంగ‌మం ఫౌండేష‌న్ సంస్థ అధ్య‌క్షులు, సినీ ప‌రిశోధ‌కులు సంజ‌య్ కిశోర్ తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

''మ‌హాన‌టుడు య‌స్‌.వి.రంగారావుగారి శ‌త‌జ‌యంతి సంవ‌త్స‌ర‌మిది. ఈ సంద‌ర్భంగా మా 'సంగ‌మం' సంస్థ హైద‌రాబాద్‌లో య‌స్‌.వి.రంగారావు శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నుంది. ఈ వేడుక‌ల‌ను రంగారావుగారి జ‌న్మ‌దిన‌మైన జులై మూడో తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని ర‌వీంద్ర‌భార‌తిలో నిర్వ‌హిస్తాం. శ్రీ మండ‌లి బుద్ధ ప్ర‌సాద్‌గారు, కె.వి. ర‌మ‌ణ‌గార్ల నేతృత్వంలో ఏర్పాటైన ఉత్స‌వ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఈ వేడుక‌ల‌కు భార‌త ఉప‌రాష్ట్ర‌పతి శ్రీ ఎం.వెంకయ్య‌నాయుడుగారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

శ‌త‌జ‌యంతి వేడుక‌ల స‌భ‌లో య‌స్‌.వి.రంగారావుగారితో క‌లిసి న‌టించిన అల‌నాటి న‌టీన‌టుల‌ను స‌త్క‌రిస్తాం. అలాగే య‌స్‌.వి.ఆర్‌. త‌రువాతి త‌రాల‌లో పేరు తెచ్చుకున్న క్యారెక్ట‌ర్ న‌టీన‌టుల‌ను కూడా ప్ర‌త్యేకంగా స‌త్క‌రిస్తాం'' అని అన్నారు.

More News

'పంతం' ప్రీ-రిలీజ్ వేడుక డిటైల్స్‌..

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్, పంజాబి ముద్దుగుమ్మ‌ మెహరీన్ జంటగా నటించిన చిత్రం 'పంతం'. 

'కన్నుల్లో నీ రూపమే' ఆడియో సక్సెస్ మీట్.....

ఎ.ఎస్.పి క్రియేషన్స్ పతాకంపై ఇరుసడ్ల రాజమౌళి సమర్పణలో భాస్కర్ బాసాని నిర్మాతగా, బిక్స్ ఇరుసడ్ల దర్శకుడిగా పరిచయమౌతున్న చిత్రం "కన్నుల్లో నీ రూపమే".

'డిస్కో రాజా'.. తండ్రీ కొడుకులుగా ర‌వితేజ‌

గత ఏడాది 'రాజా ది గ్రేట్'తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు మాస్ మహరాజా రవితేజ. అయితే.. ఆ త‌రువాత వ‌చ్చిన‌ 'టచ్ చేసి చూడు',

మ‌హేష్ సినిమాలో మ‌రోసారి..

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఉత్త‌రాది భామ‌ పూజా హెగ్డే జంటగా ఓ సినిమా రూపొందుతున్న‌ సంగ‌తి తెలిసిందే.

ఆస్కార్ ఆహ్వానం అందుకున్న భార‌తీయ తార‌లు...

ఆస్కార్ అవార్డుల‌ను ప్ర‌దానం చేసే ద అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ అండ్ సైన్సెస్ సంస్థ కొత్తగా అవార్డులు ప్ర‌దానం చేయ‌డానికి 58 దేశాలు..