రియాకు సుశాంత్ సోదరి స్ట్రాంగ్ కౌంటర్..

  • IndiaGlitz, [Friday,August 28 2020]

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విషయంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సుశాంత్ కుటుంబంపై ఆరోపణలు గుప్పించింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేసింది. సుశాంత్ కుటుంబం అతనికి దూరంగా ఉండేదని, తండ్రితోనూ, సోదరితోనూ సుశాంత్‌‌కు విభేదాలు ఉండేవని రియా తెలిపింది.

రియా వ్యాఖ్యలపై సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా రియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రియా ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు తమ సోదరుడంటే తమకు ప్రేమ లేదు.. నిజమేనని.. అందుకే అమెరికా నుంచి ఇండియాకు వచ్చానని శ్వేతా సింగ్ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో తాను అమెరికా నుంచి భారత్‌కు వచ్చానని తెలిపారు. దానికి సంబంధించిన విమానం టికెట్‌ను కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన సోదరుడు చంఢీగఢ్ వెళ్తున్నాడని తెలిసి అమెరికాలో తన బిజినెస్‌ను, పిల్లలను వదిలేసి ఇక్కడకు వచ్చానని శ్వేత తెలిపారు. అయితే ఆ పర్యటనలో తాను తన సోదరుడిని కలుసుకోలేకపోయానన్నారు. తాను వచ్చే సమయానికే రియా నుంచి వచ్చిన వరుస ఫోన్ కాల్స్ వల్ల, షూటింగ్‌ల వల్ల తన సోదరుడు వెళ్లిపోయాడని వివరించారు. సుశాంత్ కోసం అతని ఫ్యామిలీ మొత్తం పోరాడుతోందని శ్వేత వెల్లడించారు.

కాగా.. రియా చ‌క్ర‌వ‌ర్తికి స‌మ‌న్లు జారీ చేయడంతో ఆమె ఈ రోజు ఉదయం ముంబైలోని డీఆర్‌డీవో అతిథి గృహానికి వచ్చింది. అక్కడే సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆమెతో పాటు సుశాంత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పితానిని కూడా సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు. నిన్న రియా సోదరుడితో పాటు, సుశాంత్ సింగ్‌ కుటుంబ సభ్యులను కూడా అధికారులు విచారించారు.

More News

సినీ ఆర్టిస్టులకు భారీ విరాళం అందజేసిన సూర్య..

కరోనా కాలంలో కష్టాలు ఎందుర్కొంటున్న సినీ ఆర్టిస్టులను ఆదుకునేందుకు హీరో సూర్య ముందుకొచ్చారు.

'గుర్తుందా శీతాకాలం' చిత్రం షూటింగ్ ప్రారంభం

కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నదైన శైలిలో న‌టిస్తూ ప్రేక్ష‌కాభిమానం సొంతం చేసుకుంటున్న యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కీబ్యూటీ త‌మన్నా

139 మంది అత్యాచారం కేసులో కీలకంగా మారిన ‘డాలర్ బాయ్’..

తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

బిగ్‌బాస్-4కి ముహూర్తం ఫిక్స్..

‘బిగ్‌బాస్’ సీజన్ 4 ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూసే ప్రేక్షకులకు షో యాజమాన్యం తేదీని ప్రకటించేసింది.

దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. తాజాగా 77 వేలకు పైగా కేసులు

భారత్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసుల్లో కొత్త రికార్డులు సాధిస్తోంది.