ఆగస్ట్ 9న మహేశ్ ఫ్యాన్స్‌కు సర్‌ఫ్రైజ్..

  • IndiaGlitz, [Friday,August 02 2019]

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్ట్-09 అన్న విషయం తెలిసిందే. నిజంగా ఇది మహేశ్ అభిమానులు పెద్ద పండుగ రోజే. ఆ రోజు ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహేశ్ వీరాభిమానులు, డై హార్డ్ ఫ్యాన్స్‌ సంబరాలు అంబరాన్నంటుతాయి. అయితే ఇదే రోజు మహేశ్ ఫ్యాన్స్‌కు సర్‌ఫ్రైజ్ ఇవ్వడానికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం డైరెక్టర్ అనీల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారట. ఇదే జరిగితే నిజంగా మహేశ్ అభిమానులకు అనీల్ మంచి కిక్ ఇచ్చినట్లే మరి.

సూపర్ స్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా మైక్రో టీజర్ లేదా ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది విడుదలైనా ఇక మహేశ్ అభిమానుల ఆనందం రెట్టింపవుతుందని చెప్పుకోవచ్చు. కాగా ఇప్పటికే ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు ఓ పిక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. అంతేకాదు.. కొద్దిరోజుల  క్రితమే కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుగా.. త్వరలోనే రష్మిక మందన్న హీరోయిన్‌తో సెకండ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తోంది.

మరోవైపు ఈ చిత్రంలో అలనాటి సీనియర్ నటి.. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఓ ప్రధాన పాత్ర నుంచి హీరో కమ్ విలన్ జగపతి బాబు తప్పుకోగా.. ప్రకాష్ రాజ్ ఆ పాత్రలో నటిస్తున్నారని వార్తలు వచ్చిన విషయం విదితమే. మొత్తానికి చూస్తే ఆగస్ట్-09న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం ఇచ్చే సర్‌ఫ్రైజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

More News

నాగ్ దెబ్బకు ఎన్టీఆర్ రికార్డ్ బద్దలైందిగా!!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-1 జూనియర్ ఎన్టీఆర్‌తో, సీజన్-2 నేచురల్ స్టార్ నానితో.. మూడో సీజన్‌ను అక్కినేని నాగార్జునతో ‘మా’ టీవీ యాజమాన్యం, నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేశారు.

ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ఇన్‌టెన్సివ్ థ్రిల్ల‌ర్ 'రాక్ష‌సుడు': బెల్లంకొండ శ్రీనివాస్‌

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా 'రైడ్‌', 'వీర' చిత్రాల దర్శకుడు రమేష్‌వర్మ పెన్మత్స

విడిపోతున్నామ‌ని ప్ర‌క‌టించిన హీరోయిన్‌

బాలీవుడ్ హీరోయిన్ దియామీర్జా త‌న వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ హైద‌రాబాదీ హీరోయిన్ భ‌ర్త సాహిల్ సింఘా నుండి విడాకులు తీసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ్యాపార‌వేత్త సాహిల్ సింఘాతో చాలా

ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా 'కౌసల్య కృష్ణమూర్తి'

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

ట్విట్టర్‌లో మహిళ వర్సెస్ యాంగ్రీస్టార్.. ఫైనల్‌గా రాజశేఖర్ క్లారిటీ

సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులు, నెటిజన్లకు బాగా దగ్గరయ్యారు.