మాటల మాంత్రికుడితో రాక్షసుడు

  • IndiaGlitz, [Wednesday,July 15 2015]

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ చేయడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక డిఫరెంట్ స్టయిల్ ను కనపరుస్తాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ను క్యారీ చేస్తూనే మాటల తూటాలతో ప్రేక్షకుల హృదయాన్ని తాకుతాడు. ఇప్పటి వరకు తెలుగు చలన చిత్రసీమకే పరిమితమైన త్రివిక్రమ్ త్వరలోనే తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టనున్నాడు.

తెలుగు, తమిళ సినీ మార్కెట్స్ లో తనకంటూ మార్కెట్ ను కలిగి ఉన్న హీరో సూర్య హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా రూపొందనుంది. ఈ సినిమాని ఎవరూ ప్రొడ్యూస్ చేస్తారో తెలియడం లేదు అయితే,2016 ద్వితీయార్థంలో ఈ సినమా సెట్స్ పైకి రానుంది. ఈ లోపు వీరిద్దరూ వారి సినిమాలను పూర్తి చేసుకుంటారట. ఏ పాత్రలో అయినా ఒదిగిపొయే సూర్యను త్రివిక్రమ్ ఎలా చూపించనున్నాడో మరి..

More News

'మామ మంచు.. అల్లుడు కంచు'

డా. మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే చిత్రం ''అల్లరి మొగుడు''.

ఆ హీరోయిన్ కి ఎంగేజ్ మెంట్ అయింది..

భీమిలి కబడీ జట్టు, వైశాలి, విలేజ్ లో వినాయకుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన మలయాళ హీరోయిన్ శరణ్య మోహన్ మన పక్కింటి అమ్మాయిలా అనిపించే ఈ హీరోయిన్ త్వరలోనే పెళ్లి చేసుకుంటుంది.

యంగ్ టైగర్ రోల్ అదేనా..?

‘టెంపర్’ వంటి సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా రూపొందనున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పుష్కరాల్లో మృతి చెందిన కుటుంబాలకు మోహన్ బాబు సానుభూతి

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి.

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు బాలకృష్ణ బాసట

గోదావరి పుష్కారాలు ఈరోజు ప్రారంభమైయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి.