ఫైట్ మాస్ట‌ర్ నాగ‌రాజు కుటుంబానికి 5ల‌క్ష‌ల చెక్ అంద‌జేత‌

  • IndiaGlitz, [Saturday,November 11 2017]

ఫైట్ మాస్ట‌ర్ నాగ‌రాజు 'నేనే రాజు నేనే మంత్రి' షూటింగ్ స‌మ‌యంలో అనారోగ్యం కార‌ణంగా చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ చిత్ర యూనిట్ తో పాటు, సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన మ‌రికొంత మంది స‌హ‌కారంతో ఆర్ధిక స‌హాయం ప్ర‌క‌టించింది.

దీనిలో భాగంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియో లో 'మా' అధ్య‌క్షులు శివాజీ రాజా ఆధ్వ‌ర్యంలో నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ను అందించడం జ‌రిగింది. నాగ‌రాజు భార్య సంధ్య చెక్ ను అందుకున్నారు.

అనంత‌రం నాగ‌రాజు-సంధ్య దంపతుల ముగ్గురు ఆడ‌పిల్ల‌లు బాగా చ‌దువుకుని ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని సురేష్ బాబు ఆకాంక్షించారు. అలాగే ఈ స‌హాయం ప‌ట్ల 'మా' అధ్య‌క్షులు శివాజీ రాజా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫైట్ మాస్ట‌ర్ యూనియ‌న్ ప్రెసిడెంట్ స‌తీష్ త‌దిత‌రులు పాల్గున్నారు.

More News

15 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్ర‌భాస్‌

ప్ర‌భాస్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాల‌తో వ‌రల్డ్ వైడ్‌గా ఫేమ‌స్ అయిన మ‌న తెలుగు క‌థానాయ‌కుడు ప్ర‌భాస్‌. అలాంటి ప్ర‌భాస్ కి ఇవాళ ఎంతో స్పెష‌ల్‌.

ఆకట్టుకుంటున్న కార్తీ, రకుల్ జంట

ఈ జనరేషన్లో తెలుగులో అభిమానుల సంఖ్యను గణనీయంగా ఏర్పరచుకున్న అతి కొద్ది మంది తమిళ హీరోల్లో కార్తి ఒకరు. మరోవైపు రకుల్ కి తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సాంగ్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న'దర్పణం'

వి. చిన శ్రీశైలం యాదవ్‌ ఆశీస్సులతో శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వి. రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రవీణ్‌ కుమార్‌ యాదవ్‌(వెంకట్‌ యాదవ్‌) నిర్మిస్తున్న చిత్రం 'దర్పణం'.

గ‌రుడ‌వేగ‌కి సూప‌ర్‌స్టార్మ‌ హేష్‌బాబు ప్ర‌శంస‌...

ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ క్యారెక్ట‌ర్స్‌తో మెప్పించిన డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18 ఎం'.

హాలీవుడ్ వెళ్తున్న ప్ర‌భాస్‌

ప్ర‌భాస్ బాడీ లాంగ్వేజ్‌ని స్టంట్ మాస్ట‌ర్స్ స్ట‌డీ చేయాల‌నుకుంటున్నారు. వాళ్ల‌కు అనువుగా ఉండేలా ప్ర‌భాస్ హాలీవుడ్‌కి వెళ్తున్నారు. అదీ ఏకంగా మూడు వారాలు.