జో పాత్ర మెప్పిస్తుందంటున్న సురభి

  • IndiaGlitz, [Monday,December 18 2017]

ఉషాకిర‌ణ్ మూవీస్ వారి బీరువా చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది ఢిల్లీ సుంద‌రి సుర‌భి. డీసెంట్ హిట్ అనిపించుకున్న ఆ సినిమా త‌రువాత‌.. ఎక్స్‌ప్రెస్ రాజా, ఎటాక్‌, జెంటిల్‌మ‌న్ చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ క‌థానాయిక‌గా న‌టించింది. వీటిలో ఎటాక్ చిత్రాన్ని మిన‌హాయిస్తే.. మిగిలిన రెండు చిత్రాలు కూడా మంచి విజ‌య‌మే సాధించాయి.

ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు చిత్రాలు చేస్తోంది. ఆ సినిమాలే ఒక్క క్ష‌ణం, ఓటర్‌. వీటిలో ఒక్క క్ష‌ణం ముందుగా తెర‌పైకి రానుంది. అల్లు శిరీష్ హీరోగా ఎక్క‌డికి పోతావ్ చిన్న‌వాడా ఫేమ్ వి.ఐ.ఆనంద్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సుర‌భి.. జో అనే పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది. కేవ‌లం గ్లామ‌ర్‌కే ప‌రిమితం కాకుండా.. న‌ట‌న‌కు కూడా అవ‌కాశ‌మున్న పాత్ర ఇద‌ని.. త‌న గ‌త చిత్రాల్లాగే ఈ సినిమా కూడా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని ఈ అమ్మ‌డు చెప్పుకొస్తోంది. డిసెంబ‌ర్ 28న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీత‌మందించారు.

More News

సాయిధరమ్ కి ఈ సారైనా కలిసొస్తుందా?

సుప్రీమ్ తరువాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్.

అజ్ఞాత‌వాసికి స్ఫూర్తి ఆ పుస్త‌క‌మేనా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న 25వ చిత్రం అజ్ఞాత‌వాసి. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

ఈ వారంలోనే జై సింహా టీజ‌ర్‌

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం జై సింహా. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార, హ‌రి ప్రియ‌, న‌టాషా దోషి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

'ఎంసీఏ'తో ఈ ఏడాది మా బ్యాన‌ర్‌లో డ‌బుల్ హ్యాట్రిక్ కొడుతున్నాం - దిల్‌రాజు

డ‌బుల్ హ్యాట్రిక్ హీరో.. నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా 'ఎం.సి.ఎ'. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది.

దుబాయ్ లో సాక్ష్యం షూటింగ్

టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ - యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా "సాక్ష్యం" అనే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు.