సుప్రీమ్ కోసం దిల్ రాజు భారీ ప్లాన్..

  • IndiaGlitz, [Wednesday,March 23 2016]

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోగా ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిథ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టిస్తున్నారు. ఏప్రిల్ 1న సుప్రీమ్ సినిమా రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ కుద‌ర‌లేదు. మార్చి 25 నుంచి వ‌రుస‌గా ఊపిరి, స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్, స‌రైనోడు, క‌బాలి, బ్ర‌హ్మోత్స‌వం సినిమాలు విడుద‌ల‌వుతుండ‌డంతో ఈ భారీ చిత్రాల మ‌ధ్య స‌రైన డేట్ చూసుకుని సుప్రీమ్ రిలీజ్ చేయాల‌నుకుంటున్నాడ‌ట దిల్ రాజు.

అయితే దిల్ రాజు నిర్మించిన కృష్ణాష్ట‌మి ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ఈసారి ఎలాగైనా స‌రే స‌క్సెస్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ట‌. ఇందుకు దిల్ రాజు భారీ ప్లానే వేసాడ‌ట‌. అదేమిటంటే...సుప్రీమ్ సినిమా పై మ‌రింత‌ క్రేజ్ తెచ్చేందుకు సుప్రీమ్ ఆడియో వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించాల‌నుకుంటున్నాడ‌ట‌. ఏప్రిల్ 10న సుప్రీమ్ ఆడియో ఫంక్ష‌న్ ను గ్రాండ్ గా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మ‌రి...దిల్ రాజు ప్లాన్ వ‌ర్క‌వుట్ అయి ప‌వ‌న్ ఆడియో ఫంక్ష‌న్ కి వ‌స్తే సుప్రీమ్ పై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డ‌డం ఖాయం.

More News

రోబో సీక్వెల్ లో అక్ష‌య్ లుక్ లీక్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన రోబో చిత్రం ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సంచ‌ల‌న చిత్రానికి సీక్వెల్ గా రోబో 2.0 తెర‌కెక్కుతుంది.

స‌ర్ధార్ న్యూ ట్రైల‌ర్ వ‌స్తుంది..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో వేడుక‌లో థియేట‌ర్ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే...స‌ర్ధార్ ట్రైల‌ర్ చూసిన‌వాళ్లు... సర్ధార్ ట్రైల‌ర్ అదిరిపోయింది అని కొంత మంది అంటే... కొత్త‌ద‌నం ఏమీ లేదు రొటీన్ గానే ఉంది అని మ‌రి కొంత మంది అంటున్నారు.

చిరు మూవీలో క‌మెడియ‌న్ ఇత‌నే..

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకి సంబంధించిన ప‌నులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌. ఏప్రిల్ మూడోవారంలో ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని ప్రారంభించి..మే నెల‌లో మొద‌టి షెడ్యూల్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

చ‌ర‌ణ్ తో పొలిటికల్ మూవీ ఓ యంగ్ డైరెక్ట‌ర్ డ్రీమ్..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఓ పొలిటిక‌ల్ మూవీ చేయాల‌నేది ఓ యంగ్ డైరెక్ట‌ర్ డ్రీమ్. ఇంత‌కీ ఆ యంగ్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? అసాధ్యుడు, మిస్ట‌ర్ నూకయ్య‌, ర‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు అని క‌న్నెగంటి.

మ‌ణిర‌త్నం మూవీలో కార్తీ క్యారెక్ట‌ర్ ఇదే

త‌మిళ హీరో కార్తీ న‌టించిన ఊపిరి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 25న రిలీజ్ అవుతుంది. అలాగే కాష్మోరా అనే చిత్రంలో కూడా కార్తీ న‌టిస్తున్నాడు.