'సుప్రీమ్ ' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

  • IndiaGlitz, [Friday,November 13 2015]

పిల్లా నువ్వులేని జీవితం', సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రారంభమైన సుప్రీమ్' చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. పటాస్' ఫేమ్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్ క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ ను త్వరలోనే ప్రారంభిస్తారట. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తునారు.