అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్న సూపర్‌స్టార్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్ తమిళనాడు రాజకీయాల్లోకి రావడం పక్కా అయ్యింది. ఇటీవల తన అభిమాన సంఘ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన రజినీరాంత్‌ డిసెంబర్‌ 31న పార్టీ పేరుని అనౌన్స్‌ చేస్తానని, జనవరిలో పార్టీని స్టార్ట్‌ చేస్తానని అనౌన్స్‌ చేశారు. దీంతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకుంది. రజినీకాంత్‌ తన రాజకీయ పార్టీకి సంబంధించిన పనులను నెమ్మదిగా ప్రారంభించేశాడు. రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తానని చెప్పగానే కొందరు ఆయన రాకను స్వాగతించారు. మరికొందరు ఆయన రాకను విమర్శించారు. ఆధ్యాత్మిక రాజకీయాలను తాను ప్రారంభిస్తానని రజినీకాంత్‌ చెప్పడం కూడా విమర్శలకు తావిస్తుంది. అయితే రజినీకాంత్ తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోలేదు. తన శ్రేయోభిలాషులను కలిసే పనిలో ఉన్నారు రజినీ. ఈరోజు తన అన్నయ్య సత్యనారాయణను కలుసుకున్నారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. సత్యనారాయణ తమ్ముడు కొత్త రంగంలోకి ప్రవేశిస్తుండటంపై శుభాకాంక్షలను తెలిపారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మే నెలలో జరగనున్నాయి. ఇంత తక్కువ సమయంలో రజినీకాంత్‌ తన పనులను ఎలా పూర్తి చేసి ప్రచారాన్ని చేసుకుంటారు. అసలు ఆయన పార్టీ ఎజెండా ఏంటి? జెండా ఎలా ఉండబోతుంది? అనే అంశాలు అందరిలో ఆసక్తిని నెలకొల్పాయి. మరి సినీ కెరీర్‌లో సూపర్‌స్టార్‌ అయిన రజినీకాంత్‌.. రాజకీయాల్లో సూపర్‌స్టార్‌ అవుతారో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగక తప్పదు.

More News

క్లైమాక్స్‌ ఫైట్‌ చిత్రీకరణలో 'కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2'

ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో విడుదల కావాల్సిన ప్యాన్‌ ఇండియా మూవీ 'కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2' .. కరోనా వైరస్‌ దెబ్బకు ఆగింది.

రెండేళ్ల తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన దర్శకుడు

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా 'ఆర్‌.ఎక్స్‌ 100' ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం నుండి ప్రారంభమైంది.

‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లో అడుగుపెట్టిన ఆలియా..

ప్రభాస్‌తో బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం  ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్).

సింపుల్‌గా సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్...

ప్రముఖ గాయని‌ సునీత‌(42) వివాహంపై ఈ మధ్య విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆమె స్పందించకపోవడంతో అసలు ఆ వార్త నిజమా..

నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్‌కు నాగబాబు కుటుంబం...

ఈనెల 9న మెగా డాటర్ నిహారిక వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్‌లో అత్యంత వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే.