‘సరిలేరు..’లో సూపర్‌స్టార్ పాత్ర తెలిసిపోయింది!

  • IndiaGlitz, [Wednesday,January 08 2020]

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్నివిడుద‌ల‌ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ పరంగా దూసుకెళ్లున్న చిత్రబృందం మెగాసూప‌ర్ ఈవెంట్‌‌ను జనవరి 5న అశేష అభిమానుల‌ సమక్షంలో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు, నటీనటులు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ మహేశ్‌ ఫ్యాన్స్‌ను మరింత ఊరిస్తున్నారు.

ఇదే ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్ కృష్ణ ‘సరిలేరు..’లో స్పెషల్ ఎంట్రీ ఇస్తున్నారని డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయానా చెప్పారు. అయితే ఆయన రోల్ ఏంటి..? ఎంతసేపు ఉంటుంది..? అనే విషయాలు మాత్రం సస్పెన్స్ అని.. అవేమీ అడగొద్దని తిన్నగా తప్పించుకున్నాడు డైరెక్టర్. ఇంతకీ ఆయన పాత్ర ఎలా ఉంటుంది..? అనే విషయం తాజాగా లీకయ్యింది. సినిమాలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయట. ఆ గొడవతో రెండు కుటుంబాలకు చెందిన సభ్యుల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత రీతిలో పరిస్థితులుంటాయట.

ఈ క్రమంలో పెద్ద మనిషిగా రంగంలోకి దిగి కృష్ణ పంచాయితీ చేసి ఇరు కుటుంబాలను కలుతారట. సరిగ్గా మూడు లేదా ఐదు నిమిషాలు మాత్రమే కృష్ణ పాత్ర ఉంటుందట. ఈ సెటిల్మెంట్ అయ్యాక అప్పుడు రష్మిక- మహేశ్ వివాహం జరుగుతుందట. ప్రస్తుతం ఈ రూమర్ అటు నెట్టింట్లో.. ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే జనవరి 11వరకు వేచి చూడక తప్పదు మరి.

More News

విల‌న్‌కి ఖ‌రీదైన కానుక ఇచ్చిన స్టార్ హీరో

బాలీవుడ్‌స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ త‌క్కువ మందితోనే క‌లివిడిగా ఉంటాడు. అయితే త‌న మ‌న‌సుకు ఏ మాత్రం ద‌గ్గ‌రైనా వారిని అంత సుల‌భంగా వ‌దులుకోడు.

వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్.. రాజ్యసభకు చిరు!!

ఇదేంటి.. టైటిల్ చూడగానే షాకయ్యారు కదూ.. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయ్.

'అల వైకుంఠపురంలో'... బుట్ట బొమ్మ సాంగ్ టీజర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’.

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకునే ప‌ర్ప‌స్‌ఫుల్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ’సరిలేరు నీకెవ్వరు’ - ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి

‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా పరిచమయ్యి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గాఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

'కలర్ ఫోటో' పూజా కార్యక్రమాలతో ప్రారంభం !!!

హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో.