సరికొత్త పాత్రలో సన్నిలియోన్

  • IndiaGlitz, [Wednesday,December 13 2017]

ఈ మ‌ధ్య బ‌యోపిక్‌ల చిత్రీక‌ర‌ణ ఎక్కువైంది. క్రికెట‌ర్లు, స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్‌, స్వామిజీలు, సైంటిస్టులు, రాజ‌కీయ నాయ‌కులు ఇలా ప‌లువురి జీవితాల‌పై సినిమాలు రూపొందుతున్నాయి. త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లో మ‌రో బ‌యోపిక్‌కు శ్రీకారం చుడుతున్నారు.

ఆనాటి మేటి తారల్లో మీనాకుమారి ఒకరు. తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన మీనాకుమారి జీవిత కథ ఆధారంగా హిందీలో ఓ బయోపిక్ రూపొందనున్న విషయం తెలిసిందే. మొదట మీనాకుమారి పాత్రను విద్యాబాలన్ పోషిస్తారని వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల విద్యా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని కూడా ప్రచారం జరిగింది. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలీదుగానీ ప్రస్తుతం మీనా కుమారి పాత్రకు సన్ని లియోన్‌ని ఎంపిక చేసుకున్నారట. సన్ని లియోన్ ఏమిటి, మీనాకుమారి పాత్ర చేయుడవేుమిటి అని అందరూ అనుకుంటారు. కథ వినగానే సన్ని ఓకే చెప్పడంతో చిత్ర దర్శకుడు కరణ్ రజ్దాన్ కూడా ఇలాగే అనుకున్నాడట.

ఈ స్క్రిప్ట్‌ను మాధురి దీక్షిత్, విద్యాబాలన్‌లకు వినిపించాను. వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా చేయుడానికి వారు అంగీకరించలేదు. ఆ సవుయంలోనే సన్ని కథ చెప్పమని తనను కోరడం, కథ విని ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయి. కథ గురించి, తన పాత్ర గురించి విన్న తర్వాత సన్ని ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మీనా కుమారి తాగుడుకు బానిసై ఎలా చనిపోయారు అనే విషయాల్ని సినిమాలో చూపించబోతున్నాం. ఈ పాత్రను సవుర్థవంతంగా పోషించే ధైర్యం సన్నికే ఉన్నాయి'' అంటూ సన్నిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు కరణ్.

More News

60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న 'మేళా'

మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా తదితరులు ప్రధాన తారాగణం.

రెగ్యులర్ షూట్ లో జగపతిబాబు-నారా రోహిత్ ల 'ఆటగాళ్లు'

వెర్సటైల్ ఆర్టిస్ట్స్ జగపతిబాబు-నారా రోహిత్ టైటిల్ పాత్రధారులుగా పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'ఆటగాళ్లు' రెగ్యులర్ షూటింగ్ నేడు మొదలైంది.

'ఎంసీఏ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటే్శ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్, లక్ష్మణ నిర్మాతలుగా సినిమా నిర్మితమవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఈ నెల 15 న వస్తున్న లచ్చి

ఓ ప్రముఖ ఛానెల్లో వెన్నెల అనే పోగ్రాం ద్వారా బుల్లి తెర ప్రేక్షకులకి దగ్గరైన జయతి మెట్టమెదటిసారిగా హీరోయిన్ గా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం లచ్చి.

రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్ సెన్సార్ పూర్తి

శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్.