ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

  • IndiaGlitz, [Tuesday,April 02 2024]

ఏపీలోని పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. ఏప్రిల్ 24 నుంచి సెలవులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు.

గతేడాది మే 1న పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభంకాగా జూన్ 12న తిరిగి తెరచుకున్నాయి. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా ఏప్రిల్ 24 నుంచే పాఠశాలలకు సెల‌వులు ప్రకటించారు. గతేడాది కంటే ఈసారి సమ్మర్ హాలీడేస్ ఎక్కువగా ఉండనున్నాయి. మరోవైపు పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 6 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్(SA)-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరపనున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే షెడ్యూలులో మార్పులుంటాయని విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్ 6 నుంచి 16 వరకు 1-5వ తరగతి విద్యార్థులకు.. ఏప్రిల్ 6 నుంచి 18 వరకు 6-8వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.

More News

వైసీపీకి ఓటు వేయొద్దు.. వివేకాను ఎవరు చంపారో ప్రజలకు తెలుసు: సునీత

వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయని మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తెలిపారు. వివేకా హత్య జరిగిన తర్వాత జగన్ అన్న

Kadiyam Kavya: వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై దళితులు తిరుగుబాటు

ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు మద్దతుగా అనంతబాబు కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నారు.

Mahabubnagar MLC: కోడ్ ఎఫెక్ట్.. మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా..

తెలంగాణలో ఇటీవల జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను

Phone Tapping Case: మాజీ డీసీపీ రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్‌తో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.