ఆగస్టులో సుమంత్ ఇదం జగత్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,July 18 2018]

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న ఓ వైవిధ్యమైన చిత్రం ఇదం జగత్ ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ నాయికగా పరిచయమవుతుంది. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ సుమంత్ ఈ చిత్రంలో కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని విభిన్నమైన ఆ పాత్ర ఆడియన్స్‌కు థ్రిల్ల్‌ను కలిగిస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేయ్యబోతున్నాడు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుంది. ఈ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది.

కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆగస్టు ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కో-ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీల్ శ్రీ కంఠం, నిర్మాతలు: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్

More News

ఫ్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా 'వైఫ్ ఆఫ్ రామ్' - లక్ష్మీ మంచు

వైఫ్ ఆఫ్ రామ్.. విడుదలకు ముందే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన సినిమా. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఎన్నో థ్రిల్లర్  సినిమాల్లో మనదైన ముద్ర వేసిన తెలుగు సినిమా. 

'పెద‌వి దాట‌ని మాటొక‌టుంది' ట్రైల‌ర్ లాంచ్‌

ఫిల్మ్ మాంక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై రూపొందుతోన్న చిత్రం 'పెద‌వి దాట‌ని మాటొక‌టుంది'. అదితి, టి.జి. కీర్తి కుమార్ నిర్మాత‌లు. టి.గురుప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఉత్తర మొదటి పాటను విడుదల చేసిన ఎస్ వీ కృష్ణ రెడ్డి

లైవ్ ఇన్ సి క్రియేషన్స్  ( Live in C Creations ) మరియు గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్  పతాకం పై ఎస్ ఆర్ తిరుపతి  దర్శకత్వం లో

విద్యాబాలన్ ను ఆత్మీయంగా స్వాగతించిన ఎన్.టి.ఆర్ కుటుంబం

బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ నేడు ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి పూల బొకేతో విద్యాబాలన్ కు స్వాగతం తెలిపారు.

విశాల్‌కు సారీ చెప్పిన శ్రీరెడ్డి....

కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పి టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు రేపిన శ్రీరెడ్డి.. ఇప్పుడు కోలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంది. ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌, లారెన్స్‌, శ్రీకాంత్‌, సుంద‌ర్.సి వంటి ప్రముఖుల‌