ఒక పాట మిన‌హా పూర్త‌యిన సుమంత్ చిత్రం

  • IndiaGlitz, [Saturday,May 05 2018]

మ‌ళ్ళీ రావా చిత్రంతో చాలా కాలం త‌రువాత విజ‌యాన్ని అందుకున్నారు క‌థానాయ‌కుడు సుమంత్‌. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఆ రెండు చిత్రాలే ఇదం జ‌గ‌త్, సుబ్ర‌మ‌ణ్య‌పురం. ఇదం జ‌గ‌త్ సుమంత్ న‌టిస్తున్న 24వ సినిమా కాగా.. సుబ్ర‌మ‌ణ్య పురం 25వ చిత్రం. ఇదం జ‌గ‌త్‌లో సుమంత్ ప్రెస్ ఫొటోగ్రాఫ‌ర్ పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నారు. రాత్రి పూట మాత్ర‌మే ప‌నిచేసే ఈ పాత్ర‌లో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయ‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా తాజాగా టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. మిగిలి ఉన్న పాట‌ను త్వ‌ర‌లోనే చిత్రీక‌రించ‌నున్నారు. అనిల్ శ్రీ‌కంఠం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా కేర‌ళ‌కుట్టి అంజు కురియ‌న్ తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానుంది. ఇక సుమంత్ 25వ చిత్రానికి వ‌స్తే.. ఈషా రెబ్బా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌య్యింది. ఈ ఏడాది చివ‌రలో ఈ సినిమా విడుద‌లయ్యే అవ‌కాశ‌ముంది.

More News

ఆ మ్యాజిక్ మ‌రోసారి రిపీట్ అవుతుందా?

క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్.. ఎన్నో విజ‌యవంత‌మైన సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాణ సంస్థ పేరిది.

భారీ పారితోషికం తీసుకోనున్న ర‌జ‌నీకాంత్‌?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఎన్టీఆర్ సినిమాలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

క‌బీర్ లాల్ సార‌థ్యంలో ద‌క్షిణాది భాష‌ల్లో రీమేక్ అవుతున్న స్పానిష్ మూవీ 'జూలియాస్ ఐస్‌'

యు.ఎస్‌కు చెందిన యంగ్ అండ్ ఫ్రీ ఫిలింస్ ఎల్ఎల్‌సి, ఇండియాకు చెందిన మూవీ మేజిక్‌, ప్ల‌స్ ఎక్యుప్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ... స్పానిష్‌లో సూప‌ర్ హిట్ థ్రిల్ల‌ర్ జూలియాస్ ఐస్‌

సెన్సార్ వారి మెప్పు పొందిన 'మహానటి' 

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ప్రపంచ వ్యాప్తంగా మే 9 న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది 'మహానటి'. సెన్సార్ వారు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా చిత్రం పై ప్రశంసల జల్లు కురిపించారు.