రెగ్యులర్ షూటింగ్‌లో సుమంత్ 25వ చిత్రం సుబ్రహ్మణ్యపురం

  • IndiaGlitz, [Monday,May 07 2018]

ఇటీవల మళ్ళీ రావా వంటి ఓ వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్  హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం ఉగాది పర్వదినాన ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈషా కథానాయికగా  నటిస్తున్నది. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు  చిత్ర విశేషాలను తెలియజేస్తూ సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. సుమంత్ పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. ఈ నెల 4వ తేదీ నుంచి రామోజీ ఫిలింసిటీలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాం.

ఈ నెల 12 వరకు ఆర్‌ఎఫ్‌సీలో జరిగే ఈ షెడ్యూల్‌లో సుమంత్, ఈషారెబ్బా, జోష్వ్రి ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. తప్పకుండా చిత్ర సుమంత్ కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది అని తెలిపారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కళా దర్శకత్వం: లక్ష్మీసింధూజ గ్రంధి, ప్రాజెక్ట్ డిజైనర్: కృష్ణ చిత్తనూర్, ైస్టెలింగ్: సుష్మ త్రిపురాన, ప్రొడక్షన్ కంట్రోలర్:సలాన బాలగోపాలరావు, మూలకథ: వెంకట శ్రీనివాస్ బొగ్గరం, రచనా సహకారం: నాగమురళీధర్ నామాల, నిర్మాతలు: ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి.

More News

మ‌హిళా ద‌ర్శ‌కుల‌తోనే..

ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా కె.వి.ఆనంద్ రూపొందించిన  తమిళ అనువాద చిత్రం 'అనేకుడు'(2015)తో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ముద్దుగుమ్మ అమైరా ద‌స్తూర్‌.

సుకుమార్‌కు ప్ర‌త్యేక‌మైన రోజు ఇది

'రంగస్థలం'తో సంచలన విజయం అందుకున్న ద‌ర్శ‌కుడు సుకుమార్. 1980ల నాటి గ్రామీణ వాతావరణాన్ని పునః సృష్టించి వెండితెరపై మ్యాజిక్ చేశారు.

విభిన్నమైన చిత్రాలని నిర్మించగల ప్రతిభ ని తయారు చేయడమే లక్ష్యం - నాగార్జున

'AISFM గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ 2018 ' లో భాగంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్థులు నిర్మించిన 8  చిత్రాల ప్రదర్శన అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిలిం అండ్ మీడియా (AISFM)

'నా నువ్వే' ఓ బ్యూటీఫుల్ మ్యూజికల్ ల‌వ్ స్టోరీ - నంద‌మూరి క‌ల్యాణ్ రామ్

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం 'నా నువ్వే'.

కొత్త త‌ర‌హా మేన‌రిజ‌మ్స్‌తో నాని?

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఓ మల్టీస్టారర్ మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.