సుకుమార్ నెక్ట్స్ టార్గెట్ ప్ర‌భాస్ అట‌

  • IndiaGlitz, [Monday,March 26 2018]

కథలను చాలా వైవిధ్యంగా తెరపై ఆవిష్కరించడం.. ద‌ర్శ‌కుడు సుకుమార్ స్టైల్. సినిమా చూస్తున్నంతసేపు లాజికల్‌గా ప్రతీ సన్నివేశం కరెక్ట్ అనిపించేలా చిత్రీకరించడం సుకుమార్‌కే చెల్లు. ఈ దర్శకుడు.. ఇప్పటికే  అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి అగ్ర‌క‌థానాయ‌కుల‌తో సినిమాలు చేశారు. తాజాగా ‘రంగస్థలం’ కోసం రామ్ చరణ్‌తో కూడా జట్టు కట్టారు.

తాజాగా.. త‌న‌ నెక్స్ట్ టార్గెట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని స్వయంగా సుకుమారే వెల్లడించారు.  ఓ మీడియాలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పై విధంగా స్పందించారు సుక్కు.  సైకలాజికల్‌గా భావోద్వేగ సన్నివేశాలని తెరకెక్కించడంలో దిట్ట అయిన సుక్కు, ఎటువంటి సన్నివేశంలోనైనా చక్కగా నటించగల ప్రభాస్  కలయికలో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. మరి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. తదుపరి సినిమా కోస‌మైనా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే.. సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

బాల‌య్య‌, వినాయ‌క్ సినిమా ఎప్పుడంటే..

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘జై సింహా’తో మంచి విజయాన్ని అందుకున్నారు నిర్మాత సి.కళ్యాణ్. నందమూరి బాలకృష్ణ,

ఆ అంశాల‌న్నింటిని ట‌చ్ చేసిన కొర‌టాల‌

కొరటాల శివ తీసినవి మూడే మూడు సినిమాలు. అయితే..

క‌లిసొచ్చిన క‌థానాయిక‌ల‌తో వెంకీ, చైత‌న్య‌?

సినిమాకి కథ ఎంత ముఖ్యమో, నటీనటుల ఎంపిక కూడా అంతే ముఖ్యం.

ఏప్రిల్ 18 నుంచి రాజ్ త‌రుణ్ కొత్త చిత్రం

'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21ఎఫ్' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్.

మే నెల‌లో మారుతి, చైత‌న్య మూవీ ఫ‌స్ట్‌లుక్‌

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు' (ప్ర‌చారంలో ఉన్న పేరు).