'కుమారి' తోనైనా సుకుమార్ ట్రాక్ మారేనా?

  • IndiaGlitz, [Sunday,November 08 2015]

నిర్మాణంలో ఉన్న 'నాన్న‌కు ప్రేమతో'ని క‌లుపుకుంటే.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాల సంఖ్య ఆరు. ఈ అర‌డ‌జ‌ను సినిమాల‌ను విభిన్న శైలిలో రూపొందించే ప్ర‌య‌త్న‌మే చేసారు సుకుమార్‌. ద‌ర్శ‌కుడిగా మెప్పించిన సుకుమార్‌.. 'కుమారి 21 ఎఫ్‌'తో నిర్మాత‌గానూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్న సంగ‌తి తెలిసిందే.

రాజ్ త‌రుణ్‌, హేబా ప‌టేల్ జంట‌గా న‌టించిన ఈ సినిమాకి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ నెల 20న ఈ సినిమా విడుద‌ల కానుంది. విశేష‌మేమిటంటే.. గ‌తంలో ఇదే న‌వంబ‌ర్ నెల చివ‌ర‌లో సుకుమార్ డైరెక్ట్ చేసిన 'ఆర్య 2' (2009) కూడా విడుద‌లైంది. రిజ‌ల్ట్ తెలిసిందే. ద‌ర్శ‌కుడిగా అంత‌గా అచ్చిరాని న‌వంబ‌ర్ నెల ట్రాక్ రికార్డ్‌.. నిర్మాతగానైనా సుకుమార్ విష‌యంలో మారుతుందేమో చూడాలి.

More News

గ్రాఫిక్స్ తో ముస్తాబవుతున్న 'సతీ తిమ్మమాంబ'

ఎస్.ఎస్.ఎస్.ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో భవ్యశ్రీ ప్రధాన పాత్రలో పెద్దరాసు సుబ్రమణ్యం నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ ''సతీ తిమ్మమాంబ''భారీ గ్రాఫిక్స్తో ఈనెలాఖరుకి వచ్చేందుకు ముస్తాబవుతోంది.

'లోఫర్ ' ఫస్ట్ లుక్ విడుదల

''ముకుంద'',''కంచె''వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో

డిసెంబర్ 25న 'సౌఖ్యం'

సౌఖ్యంగా ఉన్నారా?అంటున్నారు గోపీచంద్.నలుగురి క్షేమం కోరే వ్యక్తిగా,నలుగురి సౌఖ్యం కోసం ఏం చేయడానికైనా వెనకాడని వ్యక్తిగా గోపీచంద్ నటిస్తున్న చిత్రం 'సౌఖ్యం'.

నంబర్ 20న 'చిరుగొడవలు'

రోహిత్,భావిక,సిద్ధార్థ్,రాగ,నాగేంద్ర,హారిక,యోధ,గీతాంజలి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘చిరుగొడవలు’.11 ప్లస్ మూవీస్ బ్యానర్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన అన్నపూర్ణ ఫిలిం స్కూల్ విద్యార్థులు ఈ చిత్రాన్ని రూపొందించారు.

డిసెంబర్ 4న 'శంకరాభరణం'

స్వామి రారా,కార్తికేయ,సూర్య వర్సెస్ సూర్య..ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ,ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ నటించిన తాజా చిత్రం 'శంకరాభరణం'.