Nara Lokesh:హింసతో హీరో అయిపోదామనేనా : నాడు తండ్రి, నేడు కొడుకు, భీమవరంలో కేడర్‌ను రెచ్చగొట్టిన లోకేష్

  • IndiaGlitz, [Wednesday,September 06 2023]

తెలుగుదేశం పార్టీ నేతల్లో నానాటికీ ఫస్ట్రేషన్ పెరిగిపోతోంది. తమ సభకు, సమావేశాలకు జనం రాకపోవడంతో ఏదో విధంగా హైలెట్ అవ్వాలనే ఉద్దేశంతో హింసకు తెరలేపుతున్నారు. కొద్దిరోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్‌ల విధ్వంసం పేరుతో సాగునీటి ప్రాజెక్ట్‌ల సందర్శనకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా పుంగనూరు, అంగళ్లులో విధ్వంసక ఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడే దగ్గరుండి కొట్టండి, తరమండి అంటూ శ్రేణులను రెచ్చగొట్టారు. కానీ నేరం మాత్రం వైసీపీ నేతలు, పోలీసులపై వేసే ప్రయత్నం చేశారు. కానీ దీని వెనుక వున్న కుట్రను చల్లా బాబు కారు డ్రైవర్ తన వాంగ్మూలంలో బట్టబయలు చేశారు.

పుంగనూరు, అంగళ్లులో విధ్వంసానికి కారణమైన చంద్రబాబు :

తండ్రి చంద్రబాబు బాటలోనే కొడుకు నారా లోకేష్ నడిచారు. నాడు అనుమతులు లేకుండా పుంగనూరులోకి వెళ్లి హీరోయిజం చూపించాలనుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు లోకేష్ సైతం గోదావరి జిల్లాల్లో హింసకు ఆజ్యం పోశారు. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కనుసన్నల్లో పక్కా స్కెచ్‌తో నానా హంగామా సృష్టించారు. లోకేష్ పాదయాత్ర సాగుతుండగా బీర్ సీసాలు, కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీలు చించేస్తూ కేకలు , అరుపులతో ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టించారు. పుంగనూరు మాదిరే ఇక్కడా పోలీసులే బలి పశువులయ్యారు. టీడీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నంలో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఉచ్చపోయిస్తాం, నరికేస్తాం అంటున్న లోకేష్ :

నాయకుడిగా తనను నిరూపించుకోవాలని అనుకుంటున్న లోకేష్ ఇంకా పరిణితి సాధించలేకపోతున్నారు. ఆయన ప్రతి అడుగు విమర్శల పాలవుతోంది. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం, తొడలు కొట్టడం మినహా ప్రజలను ఆకట్టుకునేలా ఆయన ప్రసంగాలు లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా ఉచ్చ పోయిస్తాం, నరికేస్తాం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మొన్న గన్నవరంలో ఎవరికైతే ఎక్కువ కేసులు వున్నాయో వారికి ప్రాధాన్యత ఇస్తానంటూ లోకేష్ అన్న మాటలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సద్దుమణగకముందే భీమవరం ఘర్షణలు మరోసారి లోకేష్ సమర్ధతను ప్రశ్నిస్తున్నాయి.

ఇకపై లోకేష్‌ను ఉపేక్షించేది లేదంటున్న వైసీపీ :

కేవలం హింసను ప్రేరేపించి హీరో అవ్వాలని చూస్తున్న లోకేష్ తన భాషను, వైఖరిని మార్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఇక లోకేష్‌ను ఉపేక్షించేది లేదని అంటున్నారు. తమ సహనాన్ని తండ్రీ, కొడుకులు చేతగానితనంగా తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. భీమవరం విధ్వంసానికి సంబంధించి ఇప్పటికే అధికార పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనకు కారణమైన వారిని పోలీసులు పట్టుకునే పనిలో వున్నారు.

More News

Sathyaraj:గుహన్ వంటి విజన్ ఉన్న డైరెక్టర్.. మన్సూర్ వంటి ప్యాషన్ ఉన్న నిర్మాత కాంబోలో వస్తోన్న డిఫరెంట్ మూవీ ‘వెపన్’ - యాక్టర్ సత్యరాజ్

మిర్చి, బాహుబలి సహా ఎన్నో చిత్రాల్లో నటించిన కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్, అశ్విన్స్, జైలర్ చిత్రాల్లో మెప్పించిన యాక్టర్ వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా

Bigg Boss Telugu 7 : రతిక ప్లాన్, బకరా అయిన టేస్టీ తేజా.. యాటిట్యూడ్ చూపిస్తోన్న శివాజీ

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా మంగళవారం బిగ్‌బాస్

Bigg Boss 7 Telugu : ఆ క్యారెక్టర్లు ఎలా వేశారు.. షకీలాను కెలికిన టేస్టీ తేజ, ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ 7 సీజన్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. 14 మంది కంటెస్టెంట్స్‌లో ఇంట్లో అడుగుపెట్టారు.

Heavy Rainfall:హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన.. విద్యాసంస్థలకు సెలవు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Chandrababu Naidu:‘‘కోడ్’’తో కోట్లు కొల్లగొట్టి.. స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్లను మించిన బాబు గారి ఎత్తులు

హాలీవుడ్‌తో టూ బాలీవుడ్‌లలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్‌లో ‘‘కోడ్’’ భాష చుట్టూ తిరిగే సినిమాలు ఎన్నో వచ్చాయి.