ముగ్గురిలో 'బాహుబలి' ఎవరికి దొరుకుతుంది?

  • IndiaGlitz, [Wednesday,July 15 2015]

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో విడుదలైన కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ బాహుబలి'. రానా విలనిజంతో పాటు రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, అనుష్క, తమన్నాల నటన సినిమా పెద్ద ఎసెట్ అయింది. ప్రేక్షకులు, అభిమానులే కాకుండా విమర్శకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 160 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది.

సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు కావడం, సినిమా కూడా అదే రేంజ్ లో విజువల్ వండర్ గా ఉండటంతో సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా శాటిలైట్ హక్కుల విషయంలో మంచి పోటీ నెలకొని ఉంది. శాటిలైట్ హక్కుల దక్కించుకోవాలని ప్రముఖ టీవీ చానెళ్లు పోటీ పడుతున్నాయి. మా టీవీ, జీటీవీ, ఈ టీవీ వారు ఈ వరుసలో ముందంజలో ఉన్నారట.

ఈ హక్కులు సాయికొర్రపాటి చేతిలో ఉన్నాయని, ఆయన ఎటువైపు మొగ్గుతారోనని అందరూ ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ మొత్తాన్ని కూడా చెల్లించడానికి సదరు చానెల్స్ రెడీ అయిపోయారని ఫిలిం వర్గాల టాక్. మరి ఈ ముగ్గురిలో బాహుబలి ఎవరికి దొరుకుతుందో చూడాల్సిందే..

More News

మాటల మాంత్రికుడితో రాక్షసుడు

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ చేయడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక డిఫరెంట్ స్టయిల్ ను కనపరుస్తాడు.

'మామ మంచు.. అల్లుడు కంచు'

డా. మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే చిత్రం ''అల్లరి మొగుడు''.

ఆ హీరోయిన్ కి ఎంగేజ్ మెంట్ అయింది..

భీమిలి కబడీ జట్టు, వైశాలి, విలేజ్ లో వినాయకుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన మలయాళ హీరోయిన్ శరణ్య మోహన్ మన పక్కింటి అమ్మాయిలా అనిపించే ఈ హీరోయిన్ త్వరలోనే పెళ్లి చేసుకుంటుంది.

యంగ్ టైగర్ రోల్ అదేనా..?

‘టెంపర్’ వంటి సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా రూపొందనున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పుష్కరాల్లో మృతి చెందిన కుటుంబాలకు మోహన్ బాబు సానుభూతి

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి.