ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం స్టార్ రైట‌ర్ క‌థ‌..!

  • IndiaGlitz, [Tuesday,February 23 2021]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు రాజ‌కీయాల‌ను, మ‌రో వైపు సినిమాలు బ్యాలెన్స్ చేస్తూ ఆయ‌న సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. తెలివిగా డేట్స్‌ను కేటాయిస్తూ ఒక‌వైపు అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ రీమేక్‌తోపాటు, క్రిష్ సినిమాను పూర్తి చేస్తున్నాడు. కాగా.. ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం ఒక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. ఓ స్టార్ రైట‌ర్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇమేజ్‌ను, పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడట‌. ఆ రైట‌ర్ ఎవ‌రో కాదు.. పాన్ ఇండియా రైట‌ర్‌గా పేరు తెచ్చుకున్న విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.

‘బాహుబ‌లి, బ‌జ‌రంగీ భాయ్‌జాన్‌, మ‌ణిక‌ర్ణిక’..ఇప్పుడు త‌లైవి వంటి ప‌లు చిత్రాల‌తో పాన్ ఇండియా రేంజ్‌కు చేరు‌కున్న విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఒక‌వైపు రాజ‌మౌళి సినిమాల‌కు క‌థ‌ల‌ను అందిస్తూనే మ‌రో వైపు ఇత‌ర ద‌ర్శ‌కులకు కూడా క‌థ‌లు అందిస్తూ వ‌స్తున్నారు. ఆ కమ్రంలో పవన్‌క‌ల్యాణ్ కోసం క‌థ‌ను సిద్ధం చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ప‌వ‌న్ అంటే ప్ర‌త్యేకంగా ఇష్ట‌ప‌డే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఎలాంటి క‌థ‌ను అందిస్తాడోన‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యానికి వ‌స్తే రీ ఎంట్రీ త‌ర్వాత ఈయ‌న న‌టించిన వ‌కీల్‌సాబ్ ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

రామ్‌చ‌ర‌ణ్, శంక‌ర్ సినిమాలో బాలీవుడ్ స్టార్‌..?

మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

క్లాసిక్ మూవీ అంటూ ‘ఉప్పెన’కు మ‌హేశ్ ప్ర‌శంస‌

ఉప్పెన టీమ్ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేసే ప‌నిలో ఉంది.  ఒక‌వైపు ప్రేక్ష‌కులే కాదు, సెల‌బ్రిటీలు సైతం సినిమాను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌తో మాస్‌  మహారాజ‌..!

మాస్ మ‌హారాజాకు క్రాక్ స‌క్సెస్ ఇచ్చిన కిక్‌తో మ‌రింత స్పీడు పెరిగింది. ‘క్రాక్’ సినిమా విడుద‌ల కాక‌ముందే ర‌మేశ్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో

‘క్షణ క్షణం’తో మెప్పిస్తానంటున్న హీరో ఉదయ్ శంకర్

నిజ జీవితంలో గిన్నిస్ రికార్డ్ సాధించిన ఓ 15 ఏళ్ల బాలుడు.. తన స్కిల్‌ను మెరుగుపరుచుకోవడం కంటే ఎక్కువగా సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు.

రామ్ స‌ర‌స‌న ‘ఉప్పెన’ బ్యూటీ

తొలి చిత్రం ఉప్పెన‌తో శాండిల్‌వుడ్ బ్యూటీ కృతిశెట్టి తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంది.