తెలంగాణలో ‘పది’ పరీక్షలు రద్దు.. అందరూ పాస్

  • IndiaGlitz, [Monday,June 08 2020]

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక.. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ఈ విషయమై నిశితంగా చర్చించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చివరికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాగా.. రాష్ట్రంలో 5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా.. అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి.

ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సీఎం నిర్వహించారు. ఈ సమావేశంలో పదవ తరగతి పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏమి చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్దతిని ఖరారు చేశారు.

ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా..

గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరగణలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డిగ్రీ, పిజి తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు హాజరయ్యారు. అయితే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

More News

బాలయ్యతో విబేధాల్లేవ్.. నాకు ప్రత్యేక గౌరవం : నాగబాబు

టాలీవుడ్ గత కొన్ని రోజులుగా నటుడు కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా నిలిచిన విషయం విదితమే.

తెలుగు ద‌ర్శ‌కుల కోసం మ‌ణిర‌త్నం..!

ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘పొన్నియ‌న్‌సెల్వ‌న్’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని ఆయ‌న రూపొందిస్తున్నారు.

విరాట‌ప‌ర్వంలో ముందు వేరే హీరోను అనుకున్నారట..

నీదినాది ఒకే క‌థ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన వేణు ఊడుగుల ఇప్పుడు విరాట‌ప‌ర్వం చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రానా, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ, పూరి

సినిమా ప‌రిశ్ర‌మ‌లో రెండు త‌ర‌గ‌తులు ఎప్ప‌టికీ ఉంటాయి. అందులో కొంద‌రు యాక్టివ్ మెంబ‌ర్స్ ఉంటే.. ఎక్కువ శాతం నాన్ యాక్టివ్ మెంబ‌ర్స్ ఉంటారు.

తొందర‌‌పడొద్దంటున్న బ‌న్నీ... ఇన్‌స్టాలో బ‌న్నీ హ‌వా

క‌రోనా ఎఫెక్ట్‌తో కొనసాగుతున్న లాక్‌డౌన్ వ‌ల్ల సినిమాల షూటింగ్స్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఓకే చెప్పింది. విధి విధానాలు ప్ర‌క‌టించాల్సి ఉంది.