Sruthi Shanmugha:బుల్లితెర నటి శృతి షణ్ముగ ప్రియ భర్త హఠాన్మరణం.. ఏడాది క్రితం పెళ్లి, అంతలోనే ఇలా

  • IndiaGlitz, [Thursday,August 03 2023]

ప్రముఖ బుల్లితెర నటి శృతి షణ్ముగ ప్రియ భర్త అరవింద్ శేఖర్ హఠాన్మరణం పాలయ్యారు. కొన్నేళ్లు డేటింగ్‌లో వీరు గతేడాది మేలో పెళ్లి చేసుకున్నారు. ఏడాదికే అరవింద్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో షణ్ముగప్రియను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అరవింద్ మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్ ఆర్టిస్ట్ అయిన శృతి.. తిరుమురుగన్ ‘‘నాథస్వరం’’ డైలీ సిట్‌కామ్‌ ద్వారా అరంగేట్రం చేసింది. వాణి రాణి, కళ్యాణ పరిసు, పొన్నుంచల్ , భారతి కన్నమ్మతో సహా అనేక హిట్ సీరియల్స్‌లో ఆమె నటించింది. శృతి, అరవింద్‌లు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా వుంటారు. వీరి వీడియోలకు పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ వుంది. అరవింద్ స్వతహాగా బాడీ బిల్డర్ కాగా.. వెయిట్ లాస్ కోచ్ కూడా. దీనిపై ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున క్లాసులు కూడా నిర్వహిస్తున్నాడు.

ఆగస్ట్ 2న సాయంత్రం అరవింద్‌కు ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అరవింద్ ప్రాణాలు విడిచినట్లుగా తెలుస్తోంది. ఎంతో అన్యోన్యంగా వుండే అరవింద్- శృతి జంటకు పెద్ద కష్టం రావడంతో ప్రేక్షకులు కంటతడిపెడుతున్నారు. అరవింద్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

More News

Rayapati Sambasivarao:బయటపడ్డ రాయపాటి అక్రమాల చిట్టా.. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం, ఇండియాలోనే పెద్ద లోన్ స్కామ్ అట

టీడీపీ నేతలు తెల్లారి లేస్తే.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శిస్తారన్నది తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్ష కోట్లు పోగేశారని,

KCR:తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ శుభవార్త .. ఆగస్ట్ 3 నుంచి రుణమాఫీ ప్రక్రియ షురూ..!!

ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన..

Tarun:అసలు ఇలాంటి ఎలా పుట్టుకొస్తున్నాయో .. ఏమైనా వుంటే నేనే చెబుతా :  పెళ్లి పుకార్లకు చెక్‌పెట్టిన తరుణ్

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా వున్న హీరో హీరోయిన్లు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు.

Jayasudha :బీజేపీలో చేరిన జయసుధ.. ఎన్నికల్లో పోటీ చేసేది సికింద్రాబాదా, ముషీరాబాదా : క్లారిటీ ఇచ్చిన సహజనటి

సీనియర్ నటి జయసుధ బీజేపీలో చేరారు. బుధవారం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో

Minister Ambati Rambabu:తగ్గేదే లేదు 'బ్రో' .. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్న అంబటి.. ఢిల్లీకి పయనం

సముద్రఖని దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సాయిథరమ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ‘బ్రో’.