అమ‌లాపురంలో 'శ్రీ‌నివాస క‌ళ్యాణం'

  • IndiaGlitz, [Sunday,June 10 2018]

నితిన్, రాశి ఖ‌న్నా, నందితా శ్వేతా హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం 'శ్రీ‌నివాస క‌ళ్యాణం'. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అమ‌లాపురంలో జ‌రుగుతోంది.

నితిన్‌, రాశి ఖ‌న్నా, నందితా శ్వేతా, ప్ర‌కాష్ రాజ్‌, జ‌య‌సుధ‌, న‌రేష్‌, ఆమ‌ని, గిరిబాబు త‌దిత‌రుల‌పై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఫ్యామిలీ రిలేష‌న్స్‌, హ్యుమ‌న్ వాల్యూస్ అనే అంశాల చుట్టూ తిరిగే ఈ సినిమాని ఆగ‌స్టు 9న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

దిల్ త‌రువాత దాదాపు 15 ఏళ్ళ గ్యాప్‌తో నితిన్‌, దిల్ రాజు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది. ఇందులో నితిన్ ఆర్కిటెక్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాకి మిక్కీ జే.మేయ‌ర్ సంగీత‌మందిస్తున్నారు.

More News

అఖిల్ 3 అప్‌డేట్‌

'అఖిల్' చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అక్కినేని అఖిల్‌.. త‌న రెండో చిత్రం హ‌లోతో న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్స్ వీళ్లే..

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 2 నేటి నుండి స్టార్ట్ అయ్యింది.  సీజ‌న్ 1లో ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ షోకు సీజ‌న్ 2లో నాని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

నా వ‌ల్ల కాదంటున్న ఎన్టీఆర్‌...

న‌ట‌న‌, ఫైట్స్‌, డాన్స్‌ల ప‌రంగా అభిమానులను మెప్పించే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఓ ప‌నిని చేయ‌లేక‌పోతున్నాడ‌ట‌.

'2.0' ఈ ఏడాది లేన‌ట్లేనా?

శివాజీ, రోబో చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడో చిత్రం '2.0'.

'అభిమ‌న్యుడు' బ్లాక్‌బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్‌

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనస్స్‌పై ఎమ్‌.