'శ్రీమంతుడు' చిత్రానికి సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,August 04 2015]

సూపర్‌స్టార్‌ మహేష్‌, శృతిహాసన్‌ జంటగా 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకుడుగా మైత్రి మూవీమేకర్స్‌ అండ్‌ ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం) అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ క్యార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎటువంటి కట్స్‌ లేకుండా ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ని ఇచ్చారు.

ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం) మాట్లాడుతూ - ''మా బేనర్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రానికి సెన్సార్‌ పూర్తయింది. ఎటువంటి కట్స్‌ లేకుండా యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు సెన్సార్‌ వారు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత చాలా మంచి సినిమా తీశారని సెన్సార్‌ సభ్యులు అభినందించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని రూపొందించారని దర్శకుడు కొరటాల శివను ప్రశంసించారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌ 7న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే ఈ చిత్రం ఆడియోకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. మొదటి చిత్రంగా మేం నిర్మించిన ఈ చిత్రం మా బేనర్‌లో మొదటి సూపర్‌హిట్‌ చిత్రంగా నిలుస్తుంది'' అన్నారు.

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

More News

చెన్నైకి చేరుకున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు’. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో

బన్ని టైటిల్

‘రేసుగుర్రం’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చేసిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ ను అందుకుంది.

ధనలక్ష్మి తలుపు తడితే సక్సెస్ పట్ల నిర్మాత ఆనందం

ధనరాజ్, మనోజ్నందం, అనిల్కళ్యాణ్, శ్రీముఖి, రణధీర్, సింధుతులాని, నాగబాబు, తాగుబోతు రమేష్లతోపాటు ‘జబర్దస్త్ బ్యాచ్’ నటించిన ‘ధనలక్ష్మి తలుపు తడితే’ జూలై 31న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

కలెక్షన్ కింగ్ కి ఊరట...

కేంద్ర ప్రభుత్వం నుండి పద్మ శ్రీ అవార్డు అందుకున్న మోహన్ బాబుకి అవార్డుతో పాటు కొన్ని అవాంతరాలు కూడా వచ్చాయి.

అవును పవన్ తోనా...?

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించిన ‘భజరంగీ భాయ్ జా’న్ చిత్రం కూడా సూపర్ సక్సెస్ కావడంతో విజయేంద్రప్రసాద్ కి మంచి గుర్తింపు లభించింది.